Kalki 2898 AD: “నన్ను చంపొద్దు ప్లీజ్” ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Bachchan requests Prabhas’ fans not to kill him after watching Kalki 2898 AD: కల్కి 2898 AD రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లో చిత్రబృందం చురుగ్గా పాల్గొంటోంది. కల్కి 2898 AD నిర్మాణ సంస్థ వైజయంతీ నెట్వర్క్ ఒక కొత్త వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే మరియు నిర్మాతలు ప్రియాంక దత్ మరియు స్వప్నా దత్, ప్రభాస్ ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. సినిమాలో తన పాత్ర కోసం దర్శకుడు తనను సంప్రదించిన విషయాన్ని అమితాబ్ గుర్తు చేసుకున్నారు. అప్పుడే ప్రభాస్ అభిమానులకు అమితాబ్ క్షమాపణలు చెప్పాడు. దీని గురించి ఆయన మాట్లాడుతూ, “నాగీ (నాగ్ అశ్విన్) నాతో దీని గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు, అతను నా పాత్ర ఎలా ఉంటుందో, ప్రభాస్ ఎలా ఉంటుందో ఒక ఫొటో తీసుకువచ్చాడు. ఇక ప్రభాస్ని డంప్ చేసిన పెద్ద వ్యక్తిని నేనే. అందుకే ప్రభాస్ అభిమానులందరూ దయచేసి నన్ను క్షమించండి.
Sathya In Badvel : త్వరపడండి.. ఆఫర్లే.. ఆఫర్లు.. బద్వేల్ లో ఘనంగా ప్రారంభమవుతున్న సత్య..
Also Read
- Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న 'సింగిల్ స్క్రీన్' వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
- Raviteja : ఇరుముడి కోసం 'విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు'.. రీమిక్స్ ఫిక్స్
- Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా 'కరుప్పు' రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
- Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
నేను సినిమాలో ఏమి చేస్తున్నానో చూసి నన్ను హత్య చేయవద్దు” అని అమితాబ్ అన్నారు. దీంతో ప్రభాస్ అడ్డుతగులుతూ తన అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడతారని హామీ ఇచ్చారు. ఇక తాజాగా ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో అమితాబ్ మాట్లాడుతూ ‘‘నాగ్ అశ్విన్ వచ్చి తన ఆలోచనను వివరించినప్పుడు ఇలాంటి సినిమా తీయాలంటే ఎవరైనా పెట్టి పుట్టాల్సిందే. ఏది అనుకున్నాడో దాన్ని తెరపైకి తెచ్చాడు. ఇది నిజంగా అద్భుతమైన సినిమా. అందులో భాగమవడం నేను ఎప్పటికీ మరచిపోలేని అనుభవం.” ఈ కథ మహాభారత కాలం నాటిదని, భవిష్యత్తులో అనేక శతాబ్దాల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.
తాజావార్తలు
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
-
Rajat Patidar: దెబ్బ గట్టిగా తాకింది, ఇప్పుడు బాగానే ఉన్నా.. ఇక వదలను!
-
India Bans Sugar Exports: చక్కెర ఎగుమతులపై భారత్ నిషేధం.. ఎందుకు? పూర్తి వివరాలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!