Kalki 2898 AD: “నన్ను చంపొద్దు ప్లీజ్” ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Bachchan requests Prabhas’ fans not to kill him after watching Kalki 2898 AD: కల్కి 2898 AD రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లో చిత్రబృందం చురుగ్గా పాల్గొంటోంది. కల్కి 2898 AD నిర్మాణ సంస్థ వైజయంతీ నెట్వర్క్ ఒక కొత్త వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే మరియు నిర్మాతలు ప్రియాంక దత్ మరియు స్వప్నా దత్, ప్రభాస్ ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. సినిమాలో తన పాత్ర కోసం దర్శకుడు తనను సంప్రదించిన విషయాన్ని అమితాబ్ గుర్తు చేసుకున్నారు. అప్పుడే ప్రభాస్ అభిమానులకు అమితాబ్ క్షమాపణలు చెప్పాడు. దీని గురించి ఆయన మాట్లాడుతూ, “నాగీ (నాగ్ అశ్విన్) నాతో దీని గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు, అతను నా పాత్ర ఎలా ఉంటుందో, ప్రభాస్ ఎలా ఉంటుందో ఒక ఫొటో తీసుకువచ్చాడు. ఇక ప్రభాస్ని డంప్ చేసిన పెద్ద వ్యక్తిని నేనే. అందుకే ప్రభాస్ అభిమానులందరూ దయచేసి నన్ను క్షమించండి.
Sathya In Badvel : త్వరపడండి.. ఆఫర్లే.. ఆఫర్లు.. బద్వేల్ లో ఘనంగా ప్రారంభమవుతున్న సత్య..
Also Read
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
నేను సినిమాలో ఏమి చేస్తున్నానో చూసి నన్ను హత్య చేయవద్దు” అని అమితాబ్ అన్నారు. దీంతో ప్రభాస్ అడ్డుతగులుతూ తన అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడతారని హామీ ఇచ్చారు. ఇక తాజాగా ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో అమితాబ్ మాట్లాడుతూ ‘‘నాగ్ అశ్విన్ వచ్చి తన ఆలోచనను వివరించినప్పుడు ఇలాంటి సినిమా తీయాలంటే ఎవరైనా పెట్టి పుట్టాల్సిందే. ఏది అనుకున్నాడో దాన్ని తెరపైకి తెచ్చాడు. ఇది నిజంగా అద్భుతమైన సినిమా. అందులో భాగమవడం నేను ఎప్పటికీ మరచిపోలేని అనుభవం.” ఈ కథ మహాభారత కాలం నాటిదని, భవిష్యత్తులో అనేక శతాబ్దాల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!