Kalki 2898 AD: “నన్ను చంపొద్దు ప్లీజ్” ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Bachchan requests Prabhas’ fans not to kill him after watching Kalki 2898 AD: కల్కి 2898 AD రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లో చిత్రబృందం చురుగ్గా పాల్గొంటోంది. కల్కి 2898 AD నిర్మాణ సంస్థ వైజయంతీ నెట్వర్క్ ఒక కొత్త వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే మరియు నిర్మాతలు ప్రియాంక దత్ మరియు స్వప్నా దత్, ప్రభాస్ ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. సినిమాలో తన పాత్ర కోసం దర్శకుడు తనను సంప్రదించిన విషయాన్ని అమితాబ్ గుర్తు చేసుకున్నారు. అప్పుడే ప్రభాస్ అభిమానులకు అమితాబ్ క్షమాపణలు చెప్పాడు. దీని గురించి ఆయన మాట్లాడుతూ, “నాగీ (నాగ్ అశ్విన్) నాతో దీని గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు, అతను నా పాత్ర ఎలా ఉంటుందో, ప్రభాస్ ఎలా ఉంటుందో ఒక ఫొటో తీసుకువచ్చాడు. ఇక ప్రభాస్ని డంప్ చేసిన పెద్ద వ్యక్తిని నేనే. అందుకే ప్రభాస్ అభిమానులందరూ దయచేసి నన్ను క్షమించండి.
Sathya In Badvel : త్వరపడండి.. ఆఫర్లే.. ఆఫర్లు.. బద్వేల్ లో ఘనంగా ప్రారంభమవుతున్న సత్య..
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
నేను సినిమాలో ఏమి చేస్తున్నానో చూసి నన్ను హత్య చేయవద్దు” అని అమితాబ్ అన్నారు. దీంతో ప్రభాస్ అడ్డుతగులుతూ తన అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడతారని హామీ ఇచ్చారు. ఇక తాజాగా ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో అమితాబ్ మాట్లాడుతూ ‘‘నాగ్ అశ్విన్ వచ్చి తన ఆలోచనను వివరించినప్పుడు ఇలాంటి సినిమా తీయాలంటే ఎవరైనా పెట్టి పుట్టాల్సిందే. ఏది అనుకున్నాడో దాన్ని తెరపైకి తెచ్చాడు. ఇది నిజంగా అద్భుతమైన సినిమా. అందులో భాగమవడం నేను ఎప్పటికీ మరచిపోలేని అనుభవం.” ఈ కథ మహాభారత కాలం నాటిదని, భవిష్యత్తులో అనేక శతాబ్దాల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?