Physical Harassment: భర్తను తీవ్రంగా కొట్టి.. భార్యను లాక్కెళ్లి సామూహిక అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical Harassment: ప్రస్తుతం సమాజంలో మహిళలకు రక్షణ కరువైంది. రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరోచోట దారుణం జరిగింది. ఒడిశాలో భర్తను దారుణంగా కొట్టి భార్యపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని సీనియర్ పోలీసు అధికారి మంగళవారం తెలిపారు. అక్టోబర్ 21 సాయంత్రం జిల్లాలోని బరునా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ జంట జాజ్పూర్ జిల్లాకు చెందిన వారన, ఆ మహిళ తన చదువు కోసం భుబన్లో ఉంటోందని అధికారి తెలిపారు.
Also Read
- Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
- Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
- IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
Also Read: ISRO Chief : గగన్యాన్లో మహిళా వ్యోమగాములు, సైంటిస్టులకు ప్రాధాన్యం
అసలేం జరిగిందంటే(పోలీసుల ప్రకారం).. శనివారం సాయంత్రం దంపతులు భువన నుంచి తమ ఇంటికి మోటార్సైకిల్పై వెళ్తున్నారు. బరునా ప్రాంతంలోని కాలువ సమీపంలో కొందరు నేరస్థులు వారిని అడ్డగించి, ఆ వ్యక్తిని కొట్టి అతని మొబైల్ ఫోన్ లాక్కున్నారు. వారు తన భార్యను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని ఆ వ్యక్తి ఆరోపించారు. బాధితురాలు భువన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read: Alaska Airlines: ఆకాశంలో ఆగమాగం.. గాల్లో ఉన్న విమానం ఇంజన్ ఆపేందుకు ప్రయత్నించిన పైలెట్ అరెస్ట్
“మహిళ ఫిర్యాదు ఆధారంగా, కేసు నమోదు చేయబడింది. దర్యాప్తు పురోగతిలో ఉంది. ఘటనలో ప్రమేయం ఉన్న నిందితులను మేము గుర్తించాము. మేము వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాము. మరో ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి గాలింపు ప్రారంభించాము.” అని ధెంకనల్ ఎస్పీ జ్ఞాన్ రంజన్ మోహపాత్ర తెలిపారు. నేరానికి ఉపయోగించిన వాహనాలను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. “దర్యాప్తు చాలా ప్రాథమిక దశలో ఉంది. బాధితురాలి వైద్య పరీక్షల నివేదిక మాకు ఇంకా రాలేదు. అయితే, ఇది నిజమైన సంఘటన అని తెలుస్తోంది. మేము దర్యాప్తును వేగవంతం చేస్తున్నాము. మేము నిందితులందరినీ అదుపులోకి తీసుకుంటాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.” అని ఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
-
Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
-
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!