Physical Harassment: భర్తను తీవ్రంగా కొట్టి.. భార్యను లాక్కెళ్లి సామూహిక అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical Harassment: ప్రస్తుతం సమాజంలో మహిళలకు రక్షణ కరువైంది. రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరోచోట దారుణం జరిగింది. ఒడిశాలో భర్తను దారుణంగా కొట్టి భార్యపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని సీనియర్ పోలీసు అధికారి మంగళవారం తెలిపారు. అక్టోబర్ 21 సాయంత్రం జిల్లాలోని బరునా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ జంట జాజ్పూర్ జిల్లాకు చెందిన వారన, ఆ మహిళ తన చదువు కోసం భుబన్లో ఉంటోందని అధికారి తెలిపారు.
Also Read
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
Also Read: ISRO Chief : గగన్యాన్లో మహిళా వ్యోమగాములు, సైంటిస్టులకు ప్రాధాన్యం
అసలేం జరిగిందంటే(పోలీసుల ప్రకారం).. శనివారం సాయంత్రం దంపతులు భువన నుంచి తమ ఇంటికి మోటార్సైకిల్పై వెళ్తున్నారు. బరునా ప్రాంతంలోని కాలువ సమీపంలో కొందరు నేరస్థులు వారిని అడ్డగించి, ఆ వ్యక్తిని కొట్టి అతని మొబైల్ ఫోన్ లాక్కున్నారు. వారు తన భార్యను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని ఆ వ్యక్తి ఆరోపించారు. బాధితురాలు భువన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read: Alaska Airlines: ఆకాశంలో ఆగమాగం.. గాల్లో ఉన్న విమానం ఇంజన్ ఆపేందుకు ప్రయత్నించిన పైలెట్ అరెస్ట్
“మహిళ ఫిర్యాదు ఆధారంగా, కేసు నమోదు చేయబడింది. దర్యాప్తు పురోగతిలో ఉంది. ఘటనలో ప్రమేయం ఉన్న నిందితులను మేము గుర్తించాము. మేము వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాము. మరో ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి గాలింపు ప్రారంభించాము.” అని ధెంకనల్ ఎస్పీ జ్ఞాన్ రంజన్ మోహపాత్ర తెలిపారు. నేరానికి ఉపయోగించిన వాహనాలను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. “దర్యాప్తు చాలా ప్రాథమిక దశలో ఉంది. బాధితురాలి వైద్య పరీక్షల నివేదిక మాకు ఇంకా రాలేదు. అయితే, ఇది నిజమైన సంఘటన అని తెలుస్తోంది. మేము దర్యాప్తును వేగవంతం చేస్తున్నాము. మేము నిందితులందరినీ అదుపులోకి తీసుకుంటాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.” అని ఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?