పాకిస్థాన్ దేశంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పాక్ లోని సింధ్ రాష్ట్రంలో గల సంఘర్ జిల్లాలో బోర్వెల్లోని కలుషిత నీరు తాగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు మరణించారు. అయితే, ఈ ఐదుగురు పిల్లలు దాహం కావడంతో దగ్గరలో ఉన్న చేతి పంపులోని నీళ్లు తాగిన వెంటనే వారికి జ్వరం, విరేచనాలు, వాంతులు కావడంతో.. స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని డాక్టర్లు తెలిపారు. ఇక, ఈ ఘటనపై సంఘర్ డిప్యూటీ కమీషనర్ స్పందించారు. ఆ పిల్లల కుటుంబానికి తాము అండగా ఉంటామని చెప్పారు.
ఈ కలుషిత తాగునీరు మరణించిన పిల్లలు:
మురిద్ భట్టి (8 సంవత్సరాలు), ముంతాజ్ (3 సంవత్సరాలు), రషీద్ అలీ (5 సంవత్సరాలు), సానియా (4 సంవత్సరాలు), జమీరా (4 సంవత్సరాలు)గా గుర్తించారు. ఈ విషాద సంఘటన తర్వాత, డిప్యూటీ కమిషనర్ ఆరోగ్య అధికారులతో కలిసి నీటిని పరీక్షించడానికి గ్రామాన్ని సందర్శించారు. హానికరమైన పదార్థాలు ఉన్నట్లు నిర్ధారించిన జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ముందు జాగ్రత్త చర్యగా వ్యవసాయ భూమిలో అమర్చిన చేతి పంపును మూసివేశారు.