Fish Farming: చేపల పెంపకంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయం చేసే రైతులు కేవలం పంటలను మాత్రమే కాదు చేపలను కూడా పెంచుతున్నారు.. చేపల పెంపకం ఉపాదికి చక్కటి మార్గం. వీటి పెంపకంలో అధిక దిగుబడి రావాలంటే చేప పిల్లల ఎంపిక, నీటి నాణ్యత, ఎరువులు, మేత, ఆరోగ్య యాజమాన్య పద్ధతులను విధిగా పాటించాలి..
చేపల పిల్లలను ఎంపిక చేసుకోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. 3 రకాల చేప పిల్లలను 2 మీటర్లలోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలి.2-4 అంగుళాల సైజు కలిగి చురుకుగా, ఆరోగ్యంగా ఉన్న చేప పిల్లల్ని ఎంచుకోవాలి. దాణా పెట్టే ప్రత్యేక చెరువుల్లో ఎకరాకు 3 వేల పిల్లల్ని వేసుకోవచ్చు. నాచు ఎక్కువగా పెరిగే చెరువుల్లో ఎకరాకు 100-150 గడ్డి చేపపిల్లల్ని వేసుకోవడం మంచిది. మిశ్రమ పెంపకంలో చేపలతో పాటుగా రొయ్యలు పెంచుకుంటే అధిక లాభాలను పొందవచ్చు..
Also Read
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
ఇక చెరువును సారవంతం చేసి, సహజ ఆహారం ఉత్పత్తికి గాను నెలకొకసారి ఎకరానికి 500కి. కోళ్ల పెంట, లేదా 1000 కి.పశువుల ఎరువు,8 కి. యూరియా, 20 కి. సూపర్ ఫాస్ఫేట్,3 కి పోటాష్ చొప్పున చేరువంతా చల్లాలి. సేంద్రియ, రసాయన ఎరువుల్ని 15 రోజుల తేడాతో ఒకటి వేసుకున్నాక మరొకటి వేసుకోవాలి..
చేపలు బాగా ఆరోగ్యంగా ఉండాలంటే మేత తయారీకి నాణ్యమైన దినుసులు వాడాలి.. అంటే వేరు సెనగ , ప్రత్తి, చెక్క, ఖనిజలవణాలు మిశ్రమం తగు మోతాదుల్లో వాడాలి. ఎకరాకు 5-10 మేత సంచులను సూర్యోదయం తరువాతనే కట్టాలి..
చేపల ఆరోగ్యం చాలా ముఖ్యం.. అందుకే 20 రోజులకొకసారి ట్రయల్ నెట్టింగ్ చేసి కొన్ని చేపల్ని పట్టి పెరుగుదలను, ఆరోగ్యాన్ని పరిశీలించి వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలి. చేపల్లో సూక్ష్మ జీవులు, పరాన్నా జీవుల వల్ల వచ్చే వ్యాధులను సకాలంలో గుర్తించి నివారణ చేయాలి.. వీలైతే నిపుణుల సలహా మేరకు తగిన మందులను కూడా వాడటం మంచిది..
బాగా పెరిగిన చేపలను సకాలంలో పట్టుబడి చేసి, సైజుల వారిగా గ్రేడింగ్ చేసి గిట్టుబాటు ధరకు మార్కెటింగ్ చేసుకోవాలి. చేప కిలో సైజు పెరగడానికి 12 నేలలు పడుతుంది.. అయితే చేపలను పట్టి వాటిని వెదురు, లేదా థర్మాకోల్ లో ఐస్ వేసి మార్కెటింగ్ చెయ్యాలి అప్పుడే అవి పాడవ్వవు.. మంచి లాభాలను పొందవచ్చు..
తాజావార్తలు
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!