Maldives: మాల్దీవుల నుంచి భారత్కు తిరిగి వచ్చిన మొదటి సైనిక బృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాల్దీవులలో ఉన్న భారత సైనిక అధికారుల బృందం స్వదేశానికి తిరిగి వచ్చింది. అలాగే, అక్కడే ఉన్న హెలికాప్టర్ను ఆపరేట్ చేయడానికి భారతీయ పౌరుల బృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అయితే, మొదటి భారత సైనిక బృందం ఉపసంహరణకు సంబంధించి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఎలాంటి ధృవీకరణ చేయలేదు. అడ్డూ సిటీలో మోహరించిన భారత సైనికులు తిరిగి భారత్కు చేరుకున్నారని మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ (MNDF) మీడియా అధికారి అధాధూ న్యూస్ పోర్టల్కి తెలిపారు. ఇక, వారి స్థానంలోకి సమాన సంఖ్యలో భారతీయ పౌరులు పంపబడ్డారు. ఇక, భారత సైనికులు అక్కడ మోహరించిన హెలికాప్టర్ల మిషన్లను పూర్తి చేస్తారు.
Read Also: Mrunal Thakur: బంపర్ ఆఫర్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్.. పాన్ ఇండియా స్టార్కు జోడీగా!
Also Read
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
అయితే, 26 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి బ్యాచ్ ఫిబ్రవరి 26న మాలేకు చేరుకుంది. ఇప్పుడు భారతీయ సైనిక అధికారులను భర్తీ చేస్తుంది.. అడ్డూలో హెలికాప్టర్లను నడుపుతుంది. భారతదేశం కూడా ఈ బృందంతో కొత్త హెలికాప్టర్ను పంపింది. సర్వీస్ చేయాల్సిన పాత హెలికాప్టర్ను రీకాల్ చేసింది. ఈ హెలికాప్టర్తో కూడిన భారత నౌక ఫిబ్రవరి 29న అడ్డూకు చేరుకుంది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనాకు బలమైన మద్దతుదారు కావడంతో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. అతను భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడు. అందుకే ఒక్క భారత సైనిక అధికారిని కూడా తమ దేశంలో ఉండనివ్వబోమని ముయిజ్జూ గతంలో వెల్లడించారు.
Read Also: SIPRI Report : ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు కొనుగోలు చేసే దేశంగా భారత్
ఇక, మే 10 తర్వాత భారత్ కు చెందిన ఆర్మీ సిబ్బంది సివిల్ దుస్తుల్లో కూడా మాల్దీవుల్లో ఉండేందుకు అనుమతించరు అని అధ్యక్షుడు ముయిజ్జూ తెలిపారు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరిని అవలంబించాడు. మాల్దీవుల నుంచి మొత్తం 90 మంది భారతీయ సైనికులను తిరిగి పంపుతానని చెప్పుకొచ్చాడు. ముయిజ్జూ ప్రభుత్వం మాలేలో అత్యాధునిక చైనీస్ పరిశోధన నౌకను ఏర్పాటు చేసింది.. దీంతో చైనా సైన్యంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎంఎన్డీఎఫ్ ఈ పని చేసింది. ఈ ఒప్పందం ప్రకారం చైనా మాల్దీవులకు నాన్-లెథల్ ఆయుధాలను ఉచితంగా అందిస్తుంది.
తాజావార్తలు
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతోన్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!