Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- తెలంగాణలో పొత్తులపై అమిత్ షా స్పష్టమైన ప్రకటన
- ఒంటరిగానే పోటీ.. అధికారమే లక్ష్యమన్న బీజేపీ
- దక్షిణాది రాష్ట్రాలపై కమలం ప్రత్యేక ఫోకస్
- యూనిఫార్మ్ సివిల్ కోడ్పై మరోసారి స్పష్టత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah : రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (BJP) వ్యూహంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆయన స్పష్టం చేశారు. సొంత బలంతోనే ఎన్నికల్లో పోటీ చేసి, రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే తమ ఏకైక లక్ష్యమని అమిత్ షా వివరించారు.
తెలంగాణలో ‘ఒంటరి’ పోరు.. పంజాబ్ తరహా వ్యూహం
రాష్ట్రంలో పొత్తులపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, తెలంగాణ ఎన్నికల బరిలో బీజేపీ ఒంటరిగానే నిలుస్తుందని హోం మంత్రి తేల్చి చెప్పారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కూడా తాము ఇదే విధమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని ఆయన ఉదహరించారు. గతంలో ఇతర పార్టీలకు అవకాశాలు ఇచ్చిన ప్రజలు, ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారని.. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని నమ్ముకుని ఒంటరిగానే విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు.
Also Read
దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి
భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న బీజేపీ, ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని అమిత్ షా తెలిపారు. కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడానికి, ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. దక్షిణాదిన బలమైన రాజకీయ శక్తిగా ఎదగడమే తమ తదుపరి ప్రాధాన్యత అని ఆయన వివరించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ‘యూనిఫార్మ్ సివిల్ కోడ్’
జాతీయ విధానాలపై స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code – UCC) ని తీసుకురావడానికి బీజేపీ కట్టుబడి ఉందని అమిత్ షా పునరుద్ఘాటించారు. ఉత్తరాఖండ్ తరహాలోనే, బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో యూనిఫార్మ్ సివిల్ కోడ్ను దశలవారీగా అమలు చేస్తామని ప్రకటించారు. ఒకే సార్వభౌమ దేశంలో మతాలతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఒకే విధమైన చట్టం ఉండాలన్నదే తమ విధానమని, అయితే దీనివల్ల గిరిజన ప్రాంతాల సంస్కృతులకు, ఆచారాలకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రత్యేక మినహాయింపులు , నిబంధనలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
అమిత్ షా చేసిన ఈ తాజా వ్యాఖ్యలు అటు తెలంగాణ రాజకీయాల్లోనూ, ఇటు జాతీయ వ్యాప్తంగానూ సరికొత్త చర్చకు దారితీశాయి. పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించడంతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
తాజావార్తలు
-
OTR: సీఎం రేవంత్ రెడ్డి సభకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. అసలు కారణం ఏంటి?
-
Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
-
IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!