NTV Telugu Site icon

AV Ranganath : టపాసుల షాపు నిర్వాహకులు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

Av Ranganath

Av Ranganath

AV Ranganath : ట‌పాసుల దుకాణ దారులు భ‌ద్రత‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌. అబిడ్స్ బొగ్గులకుంట‌లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన క్రాక‌ర్స్ దుకాణ‌ ప్రాంతాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌. ఈ సందర్భంగా అగ్ని ప్ర‌మాదంలో పూర్తిగా కాలిపోయిన‌ క్రాక‌ర్స్ దుకాణాన్ని ఆ ప‌క్క‌నే ఆహుతి అయిన టిఫిన్ సెంట‌ర్‌ను ప‌రిశీలించి ప్ర‌మాదానికి కార‌ణాల‌ను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు ఏవీ రంగనాథ్. అగ్నికి పూర్తిగా త‌గ‌ల‌బ‌డిన దుకాణం ప‌రిస‌రాల‌ను, దుకాణం లోప‌లి భాగం ఏ మేర దెబ్బ‌తిన్నది అనేది నేరుగా ష‌ట్ట‌ర్‌లోకి వెళ్లి రంగనాథ్ ప‌రిశీలించారు. ట‌పాసుల దుకాణ దారులు భ‌ద్ర‌త‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లోనే క్రాక‌ర్స్ దుకాణాల‌ను ఏర్పాటు చేయాల‌ని రంగనాథ్ తెలిపారు. అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన దుకాణానికి అనుమ‌తులు లేవ‌ని.. ఆ ద‌గ్గ‌ర్లోని బ‌హిరంగ ప్ర‌దేశంలో దీపావ‌ళి సంద‌ర్భంగా తాత్కాలిక క్రాక‌ర్స్‌ దుకాణం ఏర్పాటు చేయ‌డానికి అనుమ‌తులు పొంది.. ఇక్క‌డ ష‌ట్ట‌ర్లో ఎలాంటి అనుమ‌తులు లేకుండా.. అమ్మ‌కాలు చేప‌ట్టార‌ని స్థానిక అధికారులు హైడ్రా క‌మిష‌న‌ర్‌కు వివ‌రించారు.

Train Accident: ప్యాసింజర్ రైలులో పేలుడు.. కోచ్‌లో దట్టమైన పొగలు..