Train Accident: ప్యాసింజర్ రైలులో పేలుడు.. కోచ్లో దట్టమైన పొగలు..
- ప్యాసింజర్ రైలు కంపార్ట్మెంట్లో మంటలు
- హర్యానాలోని జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో ప్రమాదం
- రోహ్తక్లోని సంప్లా పట్టణానికి సమీపంలో ఘటన
- పలువురి ప్రయాణికులకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. రోహ్తక్లోని సంప్లా పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురైదుగురికి స్వల్ప కాలిన గాయాలయ్యాయి. దూకడం వల్ల కొందరు గాయపడ్డారు. మంటల కారణంగా కోచ్ మొత్తం పొగతో నిండిపోయి నల్లగా మారింది. రైల్వే సిబ్బంది ప్రయాణికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి.
READ MORE: AP: పేదల ఇళ్ల నిర్మాణానికి స్థల వితరణకు ముందుకొచ్చిన ఓ వృద్ధురాలు.. సీఎం అభినందనలు
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం.. జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు సంప్లా సమీపంలోకి రాగానే ఓ కంపార్ట్మెంట్లో పేలుళ్లు సంభవించాయి. మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. చైన్ లాగి రైలును ఆపడంతో కొందరు ట్రాక్పైకి దూకి గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియనప్పటికీ.. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. రైలులో ఒక ప్రయాణికుడు బాణాసంచా తీసుకెళ్తున్నాడు. పేలుడు కారణంగా కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. పేలుడు, అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రప్పించారు.
READ MORE:Maharashtra Polls: టాప్ 10 సంపన్న అభ్యర్థులు వీళ్లే! ఫడ్నవిస్ ఎన్నో స్థానంలో ఉన్నారంటే..!
తాజావార్తలు
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!