Shocking : ఇదేందయ్యా ఇది.. ఎద్దు మూత్రం పోసినందుకు వంద రూపాయలు ఫైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన ఎద్దు మూత్రం పోసినందుకు వంద రూపాయలు ఫైన్ చెల్లించిన వింత అనుభవం ఓ నిరుపేద రైతుకు ఎదురయింది. ఈ సంఘటన ఇల్లందు పట్టణంలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని నెంబర్ టు బస్తీలో నివసించే సుందర్ లాల్ స్థానికంగా ఉంటూ ఎద్దుల బండిలో బాడుగలు తోలుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఎద్దుల బండితో పరిసర ప్రాంతాల్లోని మట్టి ఇసుక తోలుకుంటూ నాలుగు పైసలు సంపాదిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుండి ఇదే వృత్తిగా భావిస్తూ ఎద్దుల పోషణ చూసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక సింగరేణి జీఎం కార్యాలయం ముందు నుండి మట్టి తీసుకొని వచ్చేందుకు వెళుతున్న క్రమంలో జీఎం కార్యాలయం ముందు ఎద్దు ఆగి మూత్రం పోసిందని జీఎం కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read : Bomb Blast: పశ్చిమ బెంగాల్లో ఘోరం.. టీఎంసీ నేత ఇంట్లో బాంబు పేలుడు
పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కంగుతున్న సుందర్ లాల్ ఆశ్చర్యానికి గురయ్యాడు. బాడుగలు తోలుకొని జీవించే ఎద్దుల బండిని పోషించే కష్టమవుతున్న తరుణంలో ఎద్దు మూత్రం పోసినందుకు ఫైన్ కట్టడం ఏంటని సుందర్లాల్, బాధపడుతూ స్థానిక ఇల్లందు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో 100 రూపాయలు ఫైన్ చెల్లించి రసీదు తీసుకున్నాడు. సింగరేణి అధికారులు కేసు పెట్టి ఆందోళన గురి చేశారని సుందర్ లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తన 40 ఎకరాల భూమిని సింగరేణి ఓసి కింద కోల్పోయానని తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆందోళన చేస్తున్నాడు.
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
ఇటీవల ముఖ్యమంత్రిని కలవడానికి ఇల్లందు నుండే హైదరాబాదుకు పాదయాత్ర నిర్వహించాడు. పోలీసులు అడ్డుకోవడంతో కలవలేకపోయాడు. తన కొడుకు టూ వీలర్ మీద ఢిల్లీ వరకు వెళ్లి ప్రధానమంత్రిని కలిసి వచ్చాడు. అయినా సుందర్లాల్కు నష్టపరిహారం సింగరేణి యజమానం ఇవ్వడం లేదు. వాళ్ళ కుటుంబంలో ఆ భూమికి సంబంధించిన నష్ట పరిహారం చెల్లించామని చెప్తుంది సింగరేణి యాజమాన్యం. చెల్లించలేదని సుందర్లాల్ ఆందోళన కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుందర్లాల్పై ఎద్దు మూత్రం పోసినందుకు కేసు పెట్టి ఫైన్ విధించడం చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
-
Ram pothineni : Rapo 23 కోసం రూత్ లెస్ విలన్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!