Vissannapeta Financial Scam: తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో భారీ ఆర్థిక మోసానికి పాల్పడిన సంస్థపై బాధితులు సీపీకి ఫిర్యాదుకు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ.. తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో ఉన్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ నమ్మించి నట్టేట ముంచిందన్నారు. తమ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు కంటతడి పెట్టుకున్నారు.
READ ALSO: Dandora Song : సామాజిక అసమానతలను ప్రశ్నించేలా ‘దండోరా’ టైటిల్ సాంగ్
రూ.10 వేలు కడితే నెలకు వెయ్యి, లక్షకు నెలకు రూ.10 వేలు ఇస్తామని కోట్లలో డబ్బు కట్టించుకున్నారని తెలిపారు. అయితే అన్నట్లుగానే కొన్నాళ్లు నెలనెల డబ్బులు వేశారని, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డబ్బులు ఇవ్వటం లేదని వాపోయారు. గత నెల్లో ఈ సంస్థ ఛైర్మన్ దుర్గాప్రసాద్ సూసైడ్ చేసుకున్నారని, ఇప్పుడు ఆయన భార్య ఈ సంస్థ సీఈఓ శివాని డబ్బులు ఇవ్వడం లేదని వాపోయారు. తమ డబ్బులు ఇప్పించాలని సీపీకి ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు.
READ ALSO: AP Chambers Business Expo: భారత్ వైపు ప్రపంచం చూస్తోంది: మంత్రి కొండపల్లి