AP Chambers Business Expo: భారత్ వైపు ప్రపంచం చూస్తోంది: మంత్రి కొండపల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Chambers Business Expo: ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్స్పోలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. పాతికేళ్ల క్రితం చంద్రబాబు ఎలా ఆలోచించారో మనం చూశాం, ఐటీకి భవిష్యత్తు ఉంటుందని నాటి యువతను ప్రోత్సహించారు, అవసరమైన మౌళిక సదుపాయాలను ఆనాడు ఏర్పాటు చేశారని అన్నారు. భారత్ వైపు ప్రపంచం చూస్తోందని, దేశంలో పెట్టుబడులు ఎలా పెట్టాలని, దేశీయ మార్కెట్లో ఎలా అడుగు పెట్టాలనే దానిపై ప్రపంచ దేశాలు చూస్తున్నాయని అన్నారు.
READ ALSO: Lionel Messi: మెస్సీ ఈవెంట్ మేనేజర్ అరెస్ట్.. ఎవరీ సతద్రు దత్తా
Also Read
- Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు
- Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
- Best Batting Pair: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కాదు.. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటింగ్ జోడి ఇదే..
- Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
తాను ఐటీ రంగంలో 16 ఏళ్లు రాణించడానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన విధానాలే అని వెల్లడించారు. ప్రతీ ప్రోడక్ట్ కూడా భారత సమాజంలో విక్రయించే అవకాశం ఉంటుందని, ప్రపంచంలో వాడే ప్రతీ వస్తువు భారత్లో వినియోగిస్తారని చెప్పారు. డ్రోన్ టెక్నాలజీ, ఏరో స్పేస్, బయో టెక్నాలజీ ఇలా అనేక రంగాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేశారని అన్నారు. రాష్ట్రంలో సీఎం పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా పని చేస్తున్నారని వెల్లడించారు. పెద్ద పరిశ్రమలు వచ్చే దగ్గర, చిన్న తరహా పరిశ్రమలకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆయా అవకాశాలను చిన్న తరహా పారిశ్రామిక వేత్తలు వినియోగించుకోవాలని సూచించారు. రుణ, మార్కెట్, ప్రాజెక్ట్ తయారి సహా ఇతర సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని, మార్కెట్ను ఏ విధంగా పెంచుకోవాలనే దానిపై అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా మనం పని చేయాలని పిలుపునిచ్చారు. మన దేశంలో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తయారు అవుతాయని, వీటికి అంతర్జాతీయ మార్కెట్ కల్పించే దిశగా అడుగులు వేయాలని అన్నారు. అలాగే స్థానిక ఉత్పత్తులను గుర్తించి వాటికి తగ్గట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు వెళ్లి, అక్కడ మీ సమస్యలు వివరిస్తే, మీ పారిశ్రామిక భవిష్యత్తుకు కావాల్సిన పరిష్కారాలు వాళ్లు అందిస్తారని అన్నారు. విద్యార్థులను పారిశ్రామిక రంగానికి అనుసంధానం చేసే వ్యవస్థ ప్రపంచంలో జర్మనీలో ఉంది. ఇటువంటి సిద్దాంతాన్ని మన రాష్ట్రంలో అమలు జరుగుతుందని చెప్పారు. దీనిని మంత్రి నారా లోకేష్ దగ్గర ఉండి మానిటర్ చేస్తూ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కూడా కేటాయించారని చెప్పారు.
READ ALSO: Tarun Bhaskar – Eesha: పెళ్లి పీటలెక్కనున్న తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా?
తాజావార్తలు
-
Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు
-
OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
-
Zepto: దలాల్ స్ట్రీట్లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
-
Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
-
K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?