Maharashtra: ‘పంచామృతం’ సూత్రం ఆధారంగా మహారాష్ట్ర బడ్జెట్.. ప్రవేశపెట్టిన ఫడ్నవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Budget: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని సర్కారు తమ మొదటి బడ్జెట్ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘పంచామృతం’ సూత్రం ఆధారంగా రైతులు, మహిళలు, యువత, ఉపాధి, పర్యావరణం కోసం ఈ బడ్జెట్ను సమర్పించారు. ఫడ్నవీస్ తన బడ్జెట్ ప్రసంగంలో, రైతులకు రూ.6,900 కోట్లు పెంచారని, ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం అయిన మహాత్మా ఫూలే జన్ ఆరోగ్య పథకం కవరేజీని రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారని చెప్పారు.
Read Also: Tamil Nadu: అన్నాడీఎంకే, బీజేపీ మధ్య విభేదాలు.. పొత్తు సంగతేంటి?
Also Read
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్లోనే అత్యధికం..!
- RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
మహారాష్ట్ర బడ్జెట్ 2023-24 ముఖ్యాంశాలు ఇవే..
* మహారాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన తరహాలో 1.15 కోట్ల మంది రైతులకు రూ.6,000 వార్షిక నగదు ప్రయోజనాన్ని ప్రకటించింది. ఈ పథకం కోసం రాష్ట్రం ఏడాదికి రూ.6,900 కోట్ల భారాన్ని భరించనుంది.
*ఆత్మహత్యలు చేసుకున్న 14 జిల్లాల్లోని రైతులకు పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే ధాన్యానికి బదులుగా సంవత్సరానికి రూ.1,800 నగదు ప్రయోజనం లభిస్తుంది.
* నాల్గవ సమగ్ర మహిళా విధానాన్ని ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ పథకం కింద, బీపీఎల్ (దారిద్య్రరేఖకు దిగువన) కుటుంబాలకు చెందిన కుమార్తెలకు 18 ఏళ్లు వచ్చే వరకు రూ.75,000 ఇవ్వబడుతుంది.
* రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర రవాణా ప్రయాణంలో మహిళలకు 50 శాతం రాయితీ ప్రకటించారు.
* ఉపాధి కల్పన: సమర్థులైన, నైపుణ్యం కలిగిన, ఉపాధి పొందగల యువతకు రూ.11,658 కోట్ల కేటాయింపు. ఇంకా, 500 పారిశ్రామిక శిక్షణా సంస్థలను అప్గ్రేడ్ చేయడానికి రూ.2,307 కోట్ల అదనపు పెట్టుబడి పెట్టాల్సి ఉంది.
* గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, సోలార్, విండ్ ఎనర్జీ రంగంలో రూ.75,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. 20,000 గ్రామ పంచాయతీల్లో సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు.
*మహాత్మా ఫూలే జీవందయీ యోజన కింద బీపీఎల్ కుటుంబాలకు ఇచ్చే మెడిక్లెయిమ్ కవరేజీని రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. మహాత్మా ఫూలే జనరోగ్య యోజన కింద ఒక రోగి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందగలుగుతారు. గతంలో చికిత్సకు పరిమితి రూ.1.5 లక్షలుగా ఉండేది.
* మోడీ ఆవాస్ ఘర్కుల్ యోజన – ఇతర వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకు వచ్చే మూడేళ్లలో 10 లక్షల ఇళ్లు నిర్మించబడతాయి – ఈ పథకానికి వచ్చే 3 సంవత్సరాలలో రూ.12,000 కోట్లు అందుబాటులో ఉంచబడతాయి.
* థానే, నాసిక్, పింప్రి-చించ్వాడ్లలో మెట్రో ప్రాజెక్టులకు రూ.39,000 కోట్లు ప్రతిపాదించారు.
*ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో ప్లాన్ చేసిన 337 కి.మీ మెట్రో నెట్వర్క్లో, 46 కి.మీ మెట్రో లైన్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. అదనంగా ఈ సంవత్సరం 50 కి.మీ మెట్రో లైన్ను ఏర్పాటు చేయనున్నారు.
* సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వ తొలి బడ్జెట్లో, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వివిధ మెగా-ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రూ.36,000 కోట్ల కేటాయింపులను ప్రకటించారు.
* పుణెలో సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే ఏర్పాటు చేసిన తొలి మహిళా పాఠశాల అభివృద్ధికి రూ.50 కోట్లు ప్రతిపాదించారు.
* రూ.50 కోట్ల బడ్జెట్తో పూణేలోని అంబేగావ్లో ఐదవ జ్యోతిర్లింగాన్ని భీమశంకర్గా అభివృద్ధి చేయనున్నారు.
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..