Rahul Gandhi: భారత్ కోసం పోరాడుతున్నాం.. ఎంతవరకైనా సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను భారత్ స్వరం కోసం పోరాడుతున్నానని.. ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని అవమానించేలా చేసిన వ్యాఖ్యకు పరువునష్టం కేసులో దోషిగా తేలిన ఒక రోజు రాహుల్పై అనర్హత వేటు పడడం గమనార్హం. “భారతదేశం స్వరం కోసం నేను పోరాడుతున్నాను. ఎంత మూల్యం చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని హిందీలో రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
2019 పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శుక్రవారం పార్లమెంటు దిగువ సభ నుంచి బహిష్కరించబడ్డారు. లోక్సభ సెక్రటేరియట్ కూడా కేరళలోని వయనాడ్ నియోజకవర్గాన్ని ఖాళీగా ప్రకటించింది. ఎన్నికల సంఘం ఇప్పుడు ఈ స్థానానికి ప్రత్యేక ఎన్నికలను ప్రకటించవచ్చు. రాహుల్ గాంధీ ఢిల్లీలోని తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయడానికి ఒక నెల సమయం ఉంది. హైకోర్టు నుంచి ఉపశమనం పొందకపోతే అధికారిక బంగ్లా నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ చర్య వెనుక కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ గాంధీ ప్రభుత్వానికి కఠినమైన ప్రశ్నలు వేస్తున్నందున ఈ చర్య వచ్చిందని పేర్కొంది. మరోవైపు బీజేపీ ఈ చర్యను చట్టబద్ధమైనదిగా పేర్కొంది. స్వతంత్ర న్యాయస్థానం ఆయన వ్యాఖ్యపై తీర్పు ఇచ్చిందని, రాహుల్గాంధీ ఇతర వెనుకబడిన తరగతుల (OBC) కమ్యూనిటీని అవమానించాడని బీజేపీ ఆరోపించింది.
Also Read
Read Also: CM KCR: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు
రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడం, అనర్హత వేటు వేయడంపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ తన నేరారోపణ, శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఈ అంశంపై ప్రభుత్వంపై విరుచుకుపడిన కాంగ్రెస్.. ఇది భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని పేర్కొంది. చట్టబద్ధంగా, రాజకీయంగా పోరాటం చేస్తామని తేల్చి చెప్పింది. ఈ చర్య రాజకీయ ప్రతీకారమేనని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. నిజం మాట్లాడినందున ఆయనపై అనర్హత వేటు వేయడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. నిజం మాట్లాడినందుకు, రాజ్యాంగం కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నందుకు ఆయనను సభ నుంచి తొలగించారని ఖర్గే ఆరోపించారు.
ఈ చర్య భారీ ఆగ్రహానికి కారణమైంది. కాంగ్రెస్ పార్టీతో స్నేహపూర్వక సంబంధాలను పంచుకోని కొంతమందితో సహా అనేక ప్రతిపక్ష పార్టీల నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య హత్య అని నిలదీశారు. కొందరు దీనిని నియంతృత్వ చర్య అన్నారు. ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తామని రాహుల్ గాంధీ బృందం తెలిపింది.
తాజావార్తలు
-
Work From Bike: వర్క్ ఫ్రం హోం పోయింది.. వర్క్ ఫ్రం బైక్ వచ్చేసింది.. వీడియో వైరల్..
-
Maharashtra: ఫుట్బాల్ కోచ్ దారుణం.. మూడేళ్లుగా మైనర్ బాలికపై అత్యాచారం..
-
NBK 112 గ్రాండ్ లాంచ్ డేట్ ఇదేనా? బాలయ్య – కొరటాల మూవీ ఓపెనింగ్కు సీఎం చంద్రబాబు, లోకేష్!
-
US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
-
Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!