Farmers Suffering : అకాల వర్షాలతో అరిగోస పడుతున్న రైతన్నలు
తెలంగాణలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరి పంటలకు నష్టం వాటిల్లింది. పలు ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిపిపోయింది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి పోయింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసి చేతికందిన వరిపంట నేలపాలైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట రక్షణ కోసం పడ్డ కష్టమంతా గాలివాన, వడగండ్ల మూలంగా నేలపాలైందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Azam Khan: అతిక్ అహ్మద్ లాగే నన్ను చంపుతారని భయమేస్తోంది..
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
అకాల వర్షాలు వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పడి రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. చేతికొచ్చిన వరి ధాన్యం, మొక్కజొన్న నీటి పాలైంది. రాష్ట్రంలోని వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట పట్టణాల్లోని మార్కెట్ యార్డుల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. ప్రస్తుతం వాతావరణం మార్పులతో కర్షకులు బోరున విలపిస్తున్నారు. మళ్లీ వర్షం పడే అవకాశం ఉండడంతో రైతన్న భయపడిపోతున్నాడు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్లే తాము నష్టపోయామంటూ రైతులు వాపోతున్నారు.
Also Read : Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డు ఎందుకు లీజుకిస్తున్నారు?
మామిడి రైతుల తోటల్లోని మామిడి కాయలు నేలరాలడంతో తీవ్రంగా నష్టపోయారు. రైతులు తమ ధాన్యాన్ని చూస్తూ రోదిస్తున్నారు. కొన్ని గ్రామాలల్లో వరికోయకుండానే పంటచేలోని వరిధాన్యం వడగండ్ల వానకు పూర్తిగా నేలపమట్టమైంది. దీంతో చేతికి వచ్చిన పంట పనికి రాని పరిస్థితిలోకి వచ్చిందని రైతులు కంటతడిపెడుతున్నారు. అకాల వర్షాలతో పాటు, వడగండ్ల వాన దెబ్బకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
Also Read : Errabelli Dayakar Rao: కేసీఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయండి
అయితే మరో వైపు వాతావరణ శాఖ రెండు రోజులు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం విదర్భ నుంచి కొనసాగుతుంది. ఈ ప్రభావం తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!