Kisan Andolan: మరోసారి రైతు ఉద్యమానికి సన్నాహాలు.. కేంద్రంపై రైతన్నల పోరుబాట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kisan Andolan: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ పెద్దఎత్తున రైతు ఉద్యమానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యునైటెడ్ కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు మార్చి 20న పార్లమెంట్ ముట్టడికి సిద్ధమవుతున్నారు. 2024 జనవరి 26న దేశవ్యాప్తంగా రైతులు ట్రాక్టర్ కవాతు నిర్వహిస్తారని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి చౌదరి రాకేష్ టికాయత్ తెలిపారు. హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందన్నారు. భూమిని, తరాలను కాపాడుకునేందుకు రైతులు 20 ఏళ్ల పాటు ఆందోళనలకు సిద్ధంగా ఉండాలన్నారు. రైతులకు రుణం కాదు, ఎంఎస్పీపై హామీ చట్టం కావాలని ఆయన డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాల మైదానంలో నిర్వహించిన కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్లో రెండో విడత ఆందోళనను ప్రకటించారు. సంయుక్త కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ యూనియన్, హర్యానా, యూపీకి చెందిన ఖాప్ చౌదరీల చర్చల అనంతరం ఎంఎస్పీపై హామీ చట్టం కోసం దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పార్లమెంట్ భవనం వద్ద మహాపంచాయత్ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అన్ని రాష్ట్రాల రైతులతో కలిసి ఢిల్లీకి వస్తామన్నారు. సన్నాహాలు ప్రారంభించాలని రైతులకు పిలుపునిచ్చారు. భారతీయ కిసాన్ యూనియన్, యునైటెడ్ కిసాన్ మోర్చా నాయకులు సన్నాహాల కోసం దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్లు భకియు జాతీయ ప్రధాన కార్యదర్శి యుధ్వీర్ సింగ్ తెలిపారు. చౌదరి రాకేష్ టికాయత్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఎస్ఎస్పీ సంజీవ్ సుమన్, ఏడీఎం అడ్మినిస్ట్రేషన్ నరేంద్ర బహదూర్సింగ్తో భకీయు నాయకుల చర్చల అనంతరం ప్రభుత్వ ఇంటర్ కళాశాల మైదానంలో చేపట్టిన నిరవధిక సమ్మెను ముగించారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
Arvind Kejriwal: పాఠశాలలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం..
భకియు ప్రతినిధి చౌదరి రాకేష్ టికాయత్ మాట్లాడుతూ.. దేశంలో ప్రభుత్వం, నాగ్పూర్ కంపెనీల విధానం కొనసాగుతోందన్నారు. రైతుల వ్యవసాయ పొలాలకు కరెంటు మీటర్లు బిగిస్తే ఊరుకునేది లేదని.. ఇందుకు పోలీసులు, అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. బావులకు మీటర్లు బిగించడం మానుకోవాలని భకియు ప్రతినిధి డిమాండ్ చేశారు. పేదల దోపిడీ కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. రైతు సంఘం ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం కాదన్నారు. ప్రభుత్వం ఎక్కడ రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందో అక్కడికే వెళ్తామన్నారు. రైతులు 20 ఏళ్లుగా పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు. నకిలీ కేసులతో రైతులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ట్రాక్టర్ రైతు యుద్ధ విమానమని పోలీసు-పరిపాలనకు తెలియజేయాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!