Kakarla Suresh: కాకర్ల సురేష్కి మద్దతుగా కుటుంబ సభ్యుల ప్రచారం..
Kakarla Suresh: ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులోని టీడీపీ ప్రధాన పార్టీ కార్యాలయంలో వరికుంటపాడు మండలం నాయకత్వంలో నార్త్ కొండాయపాలెం పంచాయతీకి చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కాకర్ల సురేష్ తెలుగుదేశం కండువాలు తప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. అలాగే, కలిగిరి మండలంలోని పెద్ద అన్నలూరు గ్రామం నుంచి ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తలపెట్టిన పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తుంది. పెద్ద అన్నలూరు, కమ్మవారిపాలెం, కాకుటూరు వెలగపాడు, పాతూరు, కొత్తూరు, తిమ్మారెడ్డి పాలెం, అయ్యపురెడ్డి పాలెం, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు .
Read Also: Ram Charan at Pithapuram: అమ్మ, మామయ్యతో కలిసి పిఠాపురానికి రామ్చరణ్
Also Read
ఇక, ఉదయగిరి ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని చేతుల జోడించి వేడుకున్నారు. ఒక్క అవకాశం ఇస్తే పుట్టిన గడ్డ రుణం తీర్చుకొని, అభివృద్ధి ఏమిటో చూపిస్తానని తెలిపారు, మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం ముందు చూపుగా ప్రణాళిక బద్ధంగా మేనిఫెస్టో విడుదల చేశానన్నారు. సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వం, ఉదయగిరిలో గెలిచేది కాకర్ల సురేష్, నెల్లూరులో వేమిరెడ్డి విజయం తథ్యం అన్నారు. నియోజకవర్గంలో ఉన్న త్రాగునీరు సమస్యను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి 50 గడపలు ఉన్న గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఓటు వేసే ముందు ఒక్కసారి అభ్యర్థుల స్థితిగతులను ఆలోచించుకొని ఓటు వేయాలని కాకర్ల సురేశ్ కోరారు.
Read Also: Liquor Shops: మందుబాబుల ముందు జాగ్రత్త.. వైన్షాపుల ముందు క్యూ..!
కాగా, ఉదయగిరి టీడీపీ- జనసేన- బీజీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం అన్న కాకర్ల వెంకట్ వదిన కాకర్ల రుక్మిణి కలిగిరి మండలం గుడ్లదోన కాలనీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను ప్రజలకు అందించారు. అలాగే, వరికుంటపాడు మండలంలో నీ తిమారెడ్డిపల్లి, వేంపాడు, రామాపురంలకు చెందిన టీడిపి నాయకుల ఆధ్వర్యంలో రెండు వందల బైక్ లతో ఉదయగిరి నియోజక వర్గం ఎన్డీయే అభ్యర్ధి కాకర్ల సురేష్ తనయుడు కాకర్ల సంహేత్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ యువత ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇక, కొండాపురం మండలంలోని పార్లపల్లి గ్రామంలో టీడీపీ- జనసేన-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కాకర్ల సురేష్ సతీమణి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి నా భర్త కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించండి అన్ని కోరారు. దీంతో పాటు వింజమూరు మండలంలోని గుండెమడగల, ఊటుకూరు, తక్కెళ్లపాడు, ఇందిరా నగర్ గ్రామాలలో ఉదయగిరి ఎన్డీయే ఎమ్మెల్యే అభ్యర్ధి కాకర్ల సురేష్ మరదలు కాకర్ల సురేఖ ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ఉదయగిరి అభివృద్ది చెందాలంటే మా బావ కాకర్ల సురేష్ ని, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాకర్ల సురేఖ కోరారు.
తాజావార్తలు
-
Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
-
US-Iran War: “ట్రంప్పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
-
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!