Liquor Shops: మందుబాబుల ముందు జాగ్రత్త.. వైన్షాపుల ముందు క్యూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Shops: ఎన్నికల ప్రచార పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార పర్వానికి ఫుల్ స్టాప్ పడుతుంది. మైకులు బంద్ కాబోతున్నాయి. సుధీర్ఘంగా సాగిన ప్రచారానికి తెరపడబోతోంది. పార్టీలకు మిగిలింది కొన్ని గంటలే. ఈ సమయాన్ని పక్కాగా ఉపయోగించుకుని ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. చివరిరోజు అగ్రనేతల ప్రచారాలతో హోరెత్తించనున్నాయి. సరికొత్త అస్త్రాల్ని బయటకు తీయబోతున్నాయి. క్లైమాక్స్ క్యాంపెయిన్ హీటెక్కిస్తోంది. చివరి గంటల్నే పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సాయంత్రం నుంచి రెండు రోజులపాటు మందు బంద్ కానుంది. దీంతో ముందస్తుగా అప్రమత్తమైన మందుబాబులు.. వైన్ షాపుల ముందు క్యూలు కడుతున్నారు.
Read Also: Ponnam Prbhakar: బండిసంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్ ఫైర్
Also Read
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
- Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
- ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం దుకాణాలను రెండు రోజుల పాటు మూసివేయాలని సూచించింది. మే 11న సాయంత్రం ఆరు గంటల నుంచి 13 సాయంత్రం వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఈ రెండు రోజులను డ్రై డేగా ప్రకటించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఎప్పుడైతే ఈసీ ఆదేశాలిచ్చిందో మందుబాబులు అలర్టయ్యారు. ముందుగానే బాటిల్స్ బల్క్ బుకింగ్ చేసుకుంటున్నారు. లిక్కర్ బాటిల్స్ తెచ్చి పెట్టుకుంటున్నారు. దీంతో వైన్ షాపుల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇన్నిరోజులు చేసిన ప్రచారం ఒక ఎత్తు.. ఈ రెండు రోజుల ఇంకోఎత్తు. దీంతో ఆయా పార్టీల నేతలు ఓటర్లపైకి తాయిలాలు వదులుతున్నాయి. కచ్చితంగా తమకే ఓటేస్తారని భావిస్తున్న వర్గాలకు భారీగా మందు పంపిణీకి రంగం సిద్ధం చేశారు.. ముందస్తుగా భారీగా కాటన్లు తెప్పించి స్టోర్ చేశారు. ఓటర్లే కాదు.. తమ వెంటే తిరిగే కార్యకర్తలను సైతం మందులో ఓలలాడించాల్సిందే. లేదంటే వారికీ కోపం వస్తుంది. అందుకే భారీగా కాటన్లు తెప్పించి సిద్ధంగా ఉంచారు నేతలు. ఇంకేముంది తాగినోడికి తాగినంత.. తిన్నోడికి తిన్నంత అన్నట్లుగా మారనుంది పరిస్థితి.
తాజావార్తలు
-
Yash: ‘టాక్సిక్’ లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసిన రాకింగ్ స్టార్.. యష్ సంచలన ట్వీట్ వైరల్!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
-
Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
-
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
ట్రెండింగ్
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!