Raithu Bheema: రైతు బీమా కుంభకోణం.. చావు నాటకం బట్టబయలు
- రైతు బీమా కుంభకోణం..
- మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో
- చావు నాటకం బట్టబయలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raithu Bheema: మెదక్ జిల్లాలో రైతు బీమా సొమ్ము కోసం చావు నాటకానికి తెరతీసిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో బతికే ఉన్న ఇద్దరు రైతులు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి రైతు బీమా డబ్బులను దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ బాగోతం తాజాగా నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేతో బయటపడింది. గ్రామానికి చెందిన శ్రీను, మల్లేశం అనే ఇద్దరు రైతులు రైతు బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు నాటకం ఆడారు. ఈ కుంభకోణానికి మాజీ సర్పంచ్ కుమారుడు వెంకటేష్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. 2021లో శ్రీను చనిపోయినట్లు, 2023లో మల్లేశం చనిపోయినట్లు అధికారులను నమ్మించి గ్రామ పంచాయతీ నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు.
Also Read: Chalo Raj Bhavan: టీపీసీసీ ఆధ్వర్యంలో “చలో రాజ్భవన్”.. నిరసనల్లో పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం
Also Read
- Chandrababu: ప్రపంచానికే డేటా హబ్గా విశాఖ తయారవుతోంది
- Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ రికార్డు నాకు లెక్క కాదు.. టీ20ల్లో 200 కొట్టి చూపిస్తా: వైభవ్ సూర్యవంశీ
- Stock Market: లాభాల పంట పండించిన స్టాక్ మార్కెట్.. రేపటి వ్యూహం ఇలా..
- Fee Refund: నీట్ యూజీ పరీక్ష ఫీజు రిఫండ్.. దరఖాస్తుకు రెండు రోజులే సమయం..
ఆ తర్వాత రైతుల భార్యలు అధికారుల ముందూ నాటకం ఆడటానికి సిద్ధమయ్యారు. చావు నాటకంలో ఎవరికీ అనుమానం రాకుండా తమ బొట్టును తీసేసి, గాజులను తీసేసి చనిపోయిన వారి భార్యలుగా నటించారు. గ్రామస్థుల సాక్ష్యాన్ని కూడా సమకూర్చడంలో వెంకటేష్ చాకచక్యంగా వ్యవహరించాడు. దాంతో డెత్ సర్టిఫికెట్ ఆధారంగా ఇద్దరు రైతుల పేరుపై దరఖాస్తు చేసి పది లక్షల రూపాయల బీమా సొమ్ము పొందారు. అందిన డబ్బు నుంచి కొంత మొత్తాన్ని వెంకటేష్ తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ వ్యవహారంపై ఎటువంటి అనుమానాలు రాకుండా కొన్నాళ్లపాటు మాయమైపోయారు.
Also Read: Loan App Harassment: లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడి ప్రాణం బలి
అయితే, తాజాగా ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా భర్తలు చనిపోయారని చెప్పిన భార్యలపై గ్రామస్థులు అనుమానించారు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దానితో గ్రామానికి చేరుకున్న పోలీసుల విచారణ మొదలయ్యేలోపే శ్రీను, మల్లేశం కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసుకుని పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు విచారణ ముమ్మరం చేసి, మోసానికి పాల్పడిన వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో దారుణమైన వ్యవహారాలకు నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ బీమా పథకాలపై ఎటువంటి లోపాలు లేకుండా మరింత నిఘా అవసరమని స్థానికులు అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Sesha 2016: కిల్లర్ స్కెచ్తో వణికిపోయే పోలీసులు… రాత్రంతా నరకయాతన.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న థ్రిల్లర్ మూవీ
-
Team India: జూన్లో టీమ్ ఇండియా బిజీ బిజీ.. టెస్టులు, టీ20లు, వన్డేలతో సహా ఆరు అంతర్జాతీయ మ్యాచ్లు!
-
Horror Movie on OTT: తరతరాలను వెంటాడే ఆ భయంకర దుష్టశక్తి… ఊహించని ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ చేస్తున్న హారర్ థ్రిల్లర్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Chandrababu: ప్రపంచానికే డేటా హబ్గా విశాఖ తయారవుతోంది
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!