ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన మొదటి భార్య అనిత అనారోగ్యంతో చనిపోవడంతో తేజస్విని అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె అసలు పేరు వైఘారెడ్డి కాగా, ఇద్దరి జాతకాలను బట్టి పేరును మార్చారని అంటారు. మొదటి భార్య అనిత మరణాంతరం దిల్ రాజు ఒంటరిగా ఉంటున్ననేపథ్యంలో అతనికి తోడుగా ఉండేందుకు జీవిత భాగస్వామి అవసరమని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ దంపతులకి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే తేజస్విని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇక ఆమె దిల్ రాజు సారధ్యంలో సిద్దమైన సినీ ఏఐ టెక్నాలజీ లార్వేన్ ఏఐ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆమెతో తాజాగా ఎన్టీవీ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ క్రమంలో ఆమె హోమ్ టూర్ కూడా షూట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.