UPI Payments: ఉచిత UPI సేవలకు ఇక చరమగీతం..? భవిష్యత్లో డిజిటల్ చెల్లింపులకు రుసుము తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Payments: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులు వేగంగా సాగుతున్న వేళ, ఉచిత UPI సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన తాజా వ్యాఖ్యలు వినియోగదారుల్లో కలవరం రేపుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా అందుతున్న UPI సేవలు భవిష్యత్తులో ఉచితంగా ఉండకపోవచ్చని ఆయన సూచించారు.
ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ఈ విషయమై మాట్లాడుతూ.. ఉచిత డిజిటల్ లావాదేవీల యుగం ముగింపు దశకు చేరుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం యూపీఐ వ్యవస్థను ఉచితంగా కొనసాగించేందుకు ప్రభుత్వం బ్యాంకులు, ఇతర సంస్థలకు ఆర్బీఐ ద్వారా సబ్సిడీలు అందిస్తోంది. అయితే, ఈ సేవలను దీర్ఘకాలంగా ఉచితంగా కొనసాగించడం ఆర్థికంగా సాధ్యపడదని, దీనికి సంబంధించి ఖర్చులను ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
- OPEC+ Oil Production: వాహనదారులకు పండగే.. OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్?
- Fertilizers: రైతులకు ఊరట! యూరియా, డీఏపీతో నిండిన 15 నౌకలు వచ్చేస్తున్నయ్.. ఎరువుల సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
- Medical Mafia: రూ.35 మెడిసిన్ను రూ.85,000కు అమ్ముతున్నారు.. అడ్డంగా దోచుకుంటున్న అమెరికా!
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు స్పాట్ డెడ్..!
దీన్ని బట్టి చూస్తే.. భవిష్యత్లో UPI ద్వారా లావాదేవీలు చేయాలంటే వినియోగదారులు ఒక నిర్దిష్ట ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం తప్పనిసరి కాబోతుంది. ప్రస్తుతం కేంద్రం జీరో MDR (Merchant Discount Rate) విధానాన్ని కొనసాగిస్తోంది. అయితే ముందుముందు దీన్ని కొనసాగించాలా..? వద్దా..? అన్నదానిపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే అంటూ మల్హోత్రా తెలిపారు. ఈ వ్యాఖ్యలతో వాణిజ్య వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులపై MDR ఛార్జీలు తిరిగి అమలైతే భారం పడే అవకాశం ఉంది. దీంతో చాలా మంది నగదు లావాదేవీలవైపు మారుతారని నిపుణులు భావిస్తున్నారు.
భారత్ లో UPI వ్యవస్థను ఉచితంగా కొనసాగించడం ప్రపంచవ్యాప్తంగా ఓ ఆదర్శంగా నిలిచినప్పటికీ, రాబోయే కాలంలో మాత్రం ఇది సాధ్యపడదని ఆర్బీఐ స్పష్టంగా తెలిపింది. డిజిటల్ లావాదేవీలను ఆర్థికంగా స్థిరంగా ఉంచాలంటే, సేవలకు గల వ్యయాన్ని ఎవరైనా భరించాల్సిందేనని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు డిజిటల్ పేమెంట్ రంగం విజన్ మార్పుకు సంకేతంగా మారనున్నాయి. భవిష్యత్లో RBI, కేంద్ర ప్రభుత్వం UPI సేవలపై ఛార్జీలు విధించే విధానాన్ని అమలు చేస్తాయా లేదా అనేది తేలాల్సి ఉంది.
తాజావార్తలు
-
Suicide on Video Call : వీడియో కాల్లోనే విషాదం.. భార్య చూస్తుండగానే భర్త ఆత్మహత్య
-
PoK: జులై 9న ఫైనల్ వార్.. పాకిస్థాన్కు పీఓకే నేతల లాస్ట్ వార్నింగ్! ఆ రోజు ఏం జరగబోతోంది?
-
Israel: ఖమేనీ అంత్యక్రియల రోజే ఇరాన్కు షాక్.. ఇజ్రాయిల్ సంచలన హెచ్చరిక
-
Aakash Chopra: ‘సంజూకు అన్యాయం చేశారు.. మరొకరిపై వేటు వెయ్యాలని చూస్తున్నారా..?’
-
Prashant Kishor: ‘కుక్కను, పిల్లిని నిలబెట్టినా గెలుస్తామనుకుంటున్నారు’ బీజేపీపై ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!