UPI Payments: ఉచిత UPI సేవలకు ఇక చరమగీతం..? భవిష్యత్లో డిజిటల్ చెల్లింపులకు రుసుము తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Payments: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులు వేగంగా సాగుతున్న వేళ, ఉచిత UPI సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన తాజా వ్యాఖ్యలు వినియోగదారుల్లో కలవరం రేపుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా అందుతున్న UPI సేవలు భవిష్యత్తులో ఉచితంగా ఉండకపోవచ్చని ఆయన సూచించారు.
ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ఈ విషయమై మాట్లాడుతూ.. ఉచిత డిజిటల్ లావాదేవీల యుగం ముగింపు దశకు చేరుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం యూపీఐ వ్యవస్థను ఉచితంగా కొనసాగించేందుకు ప్రభుత్వం బ్యాంకులు, ఇతర సంస్థలకు ఆర్బీఐ ద్వారా సబ్సిడీలు అందిస్తోంది. అయితే, ఈ సేవలను దీర్ఘకాలంగా ఉచితంగా కొనసాగించడం ఆర్థికంగా సాధ్యపడదని, దీనికి సంబంధించి ఖర్చులను ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Also Read
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు స్పాట్ డెడ్..!
దీన్ని బట్టి చూస్తే.. భవిష్యత్లో UPI ద్వారా లావాదేవీలు చేయాలంటే వినియోగదారులు ఒక నిర్దిష్ట ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం తప్పనిసరి కాబోతుంది. ప్రస్తుతం కేంద్రం జీరో MDR (Merchant Discount Rate) విధానాన్ని కొనసాగిస్తోంది. అయితే ముందుముందు దీన్ని కొనసాగించాలా..? వద్దా..? అన్నదానిపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే అంటూ మల్హోత్రా తెలిపారు. ఈ వ్యాఖ్యలతో వాణిజ్య వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులపై MDR ఛార్జీలు తిరిగి అమలైతే భారం పడే అవకాశం ఉంది. దీంతో చాలా మంది నగదు లావాదేవీలవైపు మారుతారని నిపుణులు భావిస్తున్నారు.
భారత్ లో UPI వ్యవస్థను ఉచితంగా కొనసాగించడం ప్రపంచవ్యాప్తంగా ఓ ఆదర్శంగా నిలిచినప్పటికీ, రాబోయే కాలంలో మాత్రం ఇది సాధ్యపడదని ఆర్బీఐ స్పష్టంగా తెలిపింది. డిజిటల్ లావాదేవీలను ఆర్థికంగా స్థిరంగా ఉంచాలంటే, సేవలకు గల వ్యయాన్ని ఎవరైనా భరించాల్సిందేనని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు డిజిటల్ పేమెంట్ రంగం విజన్ మార్పుకు సంకేతంగా మారనున్నాయి. భవిష్యత్లో RBI, కేంద్ర ప్రభుత్వం UPI సేవలపై ఛార్జీలు విధించే విధానాన్ని అమలు చేస్తాయా లేదా అనేది తేలాల్సి ఉంది.
తాజావార్తలు
-
Bengal Political Crisis: మమత కోటలో అధికారులు ఖాళీ.. మాజీ సీఎస్ నుంచి అడ్వకేట్ జనరల్ వరకు వరుసగా రాజీనామాలు!
-
VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!