Gottipati Ravi Kumar: టెన్షన్ అస్సలు వద్దు.. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించం!
- వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించేది లేదు
- పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు
- స్మార్ట్ మీటర్ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి
- ప్రజల ఆమోదం లేనిదే ముందుకు వెళ్లేది లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Gottipati Ravi Kumar about Smart Meters in AP: వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించేది లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ప్రజల అంగీకారం లేకుండా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని.. పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు పెట్టాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్మార్ట్ మీటర్లపై సోషల్ మీడియాలో కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, స్మార్ట్ మీటర్ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించే ముందు చెక్ మీటర్లతో ప్రజల సందేహాలు నివృతి చేయాలని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. విశాఖపట్నంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు.
‘ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దు. పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు పెట్టాలి. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించేది లేదు. స్మార్ట్ మీటర్లపై సోషల్ మీడియాలో కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. స్మార్ట్ మీటర్ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించే ముందు చెక్ మీటర్లతో ప్రజల సందేహాలు నివృతి చేయాలి. ప్రజల ఆమోదం లేనిదే ఏ విషయం మీద కూడా ముందుకు వెళ్లేది లేదు’ అని విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పారు. విద్యుత్ సరఫరాలో అవరోధాల గురించి మంత్రి గొట్టిపాటి విద్యుత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిమాండ్కు తగినట్లు విద్యుత్ సరఫరా ఉందని అధికారులు మంత్రి కి వివరించారు.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
Also Read: AP Elections 2025: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. వైఎస్ జగన్ ఇలాఖాలో ఆగస్టు 12న పోలింగ్!
వ్యవసాయానికి ఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాల్లో 9 గంటల నిరంతరాయ విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటికి అధికారులు తెలిపారు. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లోఓల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలని సీఎండీ పృథ్వి తేజకు సూచనలు చేశారు. ఆర్డీఎస్ఎస్ పనులు త్వరతగతిన పూర్తి చేసేందుకు స్థానిక కాంట్రాక్టర్ల సాయం తీసుకోవాలని చెప్పారు. ఆర్డీఎస్ఎస్ పనులు తొలిదశ పూర్తి అయితే కానీ రెండో దశకు నిధులు కోరలేమని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. పీఎం సూర్యఘర్పై కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రతీ నియోజకవర్గంలో 10 వేల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు అందించాలని మంత్రి ఆదేశించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!