Etela Rajender : పేదోళ్ల జీవితాల గురించి కేసీఆర్కి ఎప్పటికీ అర్థం కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఔట్సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగాలు తెలంగాణలో ఉండకూడదని చెప్పాడు కేసీఆర్ అని అన్నారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్. ఇవాళ హనుమకొండలోని ఏబీవీపీ హల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ( బి.ఎం.ఎస్ అనుభందం) మొదటి రాష్ట్ర మహా సభలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల దోపిడీ వల్ల ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు నష్టం జరుగుతుందన్నారు. పేదోళ్ల జీవితాల గురించి కేసీఆర్కి ఎప్పటికీ అర్థం కాదు, దృష్టి పెట్టడని ఆయన విమర్శించారు.
Also Read : Vishwak Sen: బిగ్ బ్రేకింగ్.. పెళ్లి పీటలు ఎక్కుతున్న విశ్వక్.. ?
Also Read
ఔట్సోర్సింగ్ వ్యవస్థను ప్రభుత్వమే చేపట్టి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానని, ఏజెన్సీలు మారినప్పుడల్లా ఉద్యోగాలను తొలగిస్తున్నారు.. వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ కొత్తవి కట్టినప్పుడు వందల ఉద్యోగాలు ఖాళీలు ఉంటాయని, వాటిని భర్తీ చేసే దమ్ము లేక ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను వాడుకుంటున్నారన్నారు. అంతేకాకుండా.. ‘తెలంగాణలో ఉన్న SPDCL, NPDCL, TRANSCO GENCO లో ఉన్న కార్మికులను “భారతీయ మజ్బూర్ సంగ్” ద్వారా ఐక్యం చేసి ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటుంది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో, డిస్కంలో ఎక్కడ కూడా లైన్మెన్ లేక రైతులు, ప్రజలు ఏక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు.
Also Read : Harish Rao : నాడు తెలంగాణలో కూలీ పనులు దొరకలేదు, నేడు కూలీ వాళ్ళు దొరకడం లేదు
కనీస సౌకర్యాలు అందించే సత్తా పర్మిట్ ఉద్యోగులకి, కంపెనీలకి లేకపోవటం వల్ల కింద ఆన్నేముడ్ లేబర్ కింద వారిని తీసుకోవడం జరిగింది. SPDCL కింద ఉన్న కార్మికులకు 16వేల రూపాయల ఇస్తుంటే, NPDCL కింద ఉన్న ఉద్యోగులకు మాత్రం 8వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. సీఎండీ ప్రభాకర్ రావు నార్త్ తెలంగాణ కార్మికుల మీద ఎందుకు కక్ష కట్టారో తెలియడం లేదు. SPDCL లో కార్మికులకు ఇస్తున్న జీతాలు NPDCL కార్మికులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.
Also Read : Group 2 Reschedule : గ్రూప్-2 రీషెడ్యూల్.. కొత్త డేట్లను ప్రకటించిన TSPSC
కరెంట్ షాక్ వల్ల చనిపోయిన, వికలాంగులైన కార్మికులకు ఆర్టిజన్ పద్ధతిలో వాళ్లకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. చదువు, అనుభవాన్ని బట్టి ఖాళీగా ఉన్న స్థానాల్లో ఈ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతున్నాను. కార్మికులకు హెల్త్ కార్డు, ఈపీఎఫ్ లు ఇవ్వాలి. కార్మికులు చనిపోతే ఇన్సూరెన్స్ స్కీం ద్వారా 20 లక్షలు ఆర్థిక సాయం చేయాలి. 10వేల కోట్ల ఉన్న అప్పులను 50 వేల కోట్లు చేరింది. విద్యుత్ డిపార్ట్మెంట్ ని అప్పుల ఊబిలోకి లాగాడు కేసీఆర్.’ అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
- Tags
- big news
- bjp
- breaking news
- BRS
- cm kcr
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!