Etela Rajender : చిన్న ఉద్యోగుల మీద ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు ధాన్యం కొనుగోలు కేంద్రంను బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న మంత్రులకు నాయకులకు ఆత్మీయ సమ్మేళనం పేరుతో దావత్ ల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదన్నారు. మా రాష్ట్రంలో రైతులు మూడు పువ్వులు ఆరు కాయలు గొప్పగా.. ఆర్థికంగా బాగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి హర్యానా, పంజాబ్ మద్యప్రదేశ్, పోయి చెప్తుడు… కానీ గురిగింజ తన కింద ఉన్న నలుపు ని చూసుకోనట్లుగా ముఖ్యమంత్రిది ఉందని, రైతులు నెల రోజులుగా తారుపాలు పట్టుకొని కళ్లాల్లో ఉంటూ కాంటాలు వేయకపోవడంతో కల్లాలే ఇళ్లను చేసుకొని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అన్నవ్ ఎద్దు ఏడిసిన వ్యవసాయం బాగుపడదని చెప్పినవ్ కానీ ఈ రోజు రైతు, ఎద్దు రెండు ఏడుస్తున్నాయన్నారు. అంతేకాకుండా.. ‘కలెక్టర్లు రైతుల బాధలు తీర్చాలి.. జీతాలు తీసుకునే కలెక్టర్లు రైతుల బాధలు తీర్చాలి. అసెంబ్లీలో మాట్లాడితే స్పీకర్ 600 గ్రాముల కంటే ఎక్కువ తరుగు తీసుకోవడం లేదని చెబుతున్నారు. ఇక్కడేమో పది కేజీలు పదిహేను కేజీల తరుగు తీస్తున్నారు.
Also Read : Shalini Pandey: ప్రీతి.. నువ్వు ఈ రేంజ్ లో చూపిస్తే కుర్రాళ్ల పరిస్థితి ఏంటి..?
Also Read
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
నేను వస్తున్నా అని కేంద్రాలకు హడావుడిగా బస్తాలు పంపి కాంటాలు వేస్తాం ఎవరూ పోవద్దని రైతులకు చెబుతున్నారు’ అని ఈటల అన్నారు. దీంతో పాటు.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మద్దతు గా ఈటల రాజేందర్ కామెంట్స్ చేశారు. గత 13 రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తుతుందని, ఇచ్చిన హామీ అమలు చేయాల్సిన చోయి ప్రభుత్వం మరిచి పోయిందన్నారు. ‘చిన్న ఉధ్యోగుల మీద ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది.. పంచాయతీ కార్యదర్శులు చేసిన కృషికి రాష్ట్రానికి మంచి పేరొఛ్చింది…గ్రామాల్లో రోజుకు 14 గంటలు పనిచేస్తున్న జెపిఎస్ లను అబినందించాల్సిన ప్రభుత్వం బెదిరిస్తుంది… జెపిఎస్ లు చిన్న ఉద్యోగులే కావచ్చు కానీ ప్రజల మద్దతు వారికుంది… పంచాయతీ కార్యదర్శులను అవమానిస్తే ప్రజలను అవమానించినట్లే…. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి…. మీ సమ్మె కు బిజెపి అండగా ఉంటుంది…. పంచాయతీ సెక్రటరీలు ఒంటరి కాదు వారి తరుపున అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం… కేసీఆర్ ప్రభుత్వానికి పోయే కాలం దెగ్గరకు వచ్చింది’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
-
Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
-
Oppo Reno 16, Reno 16c: ఒప్పో రెనో 16, రెనో 16సి భారత్ లో విడుదల.. ఏఐ ఫీచర్లు, 7000mAh బ్యాటరీ
-
Tollywood: టాలీవుడ్’కి మరో షాకింగ్ విలన్ దిగుతున్నాడు
-
Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?