Etela Rajender : చిన్న ఉద్యోగుల మీద ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు ధాన్యం కొనుగోలు కేంద్రంను బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న మంత్రులకు నాయకులకు ఆత్మీయ సమ్మేళనం పేరుతో దావత్ ల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదన్నారు. మా రాష్ట్రంలో రైతులు మూడు పువ్వులు ఆరు కాయలు గొప్పగా.. ఆర్థికంగా బాగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి హర్యానా, పంజాబ్ మద్యప్రదేశ్, పోయి చెప్తుడు… కానీ గురిగింజ తన కింద ఉన్న నలుపు ని చూసుకోనట్లుగా ముఖ్యమంత్రిది ఉందని, రైతులు నెల రోజులుగా తారుపాలు పట్టుకొని కళ్లాల్లో ఉంటూ కాంటాలు వేయకపోవడంతో కల్లాలే ఇళ్లను చేసుకొని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అన్నవ్ ఎద్దు ఏడిసిన వ్యవసాయం బాగుపడదని చెప్పినవ్ కానీ ఈ రోజు రైతు, ఎద్దు రెండు ఏడుస్తున్నాయన్నారు. అంతేకాకుండా.. ‘కలెక్టర్లు రైతుల బాధలు తీర్చాలి.. జీతాలు తీసుకునే కలెక్టర్లు రైతుల బాధలు తీర్చాలి. అసెంబ్లీలో మాట్లాడితే స్పీకర్ 600 గ్రాముల కంటే ఎక్కువ తరుగు తీసుకోవడం లేదని చెబుతున్నారు. ఇక్కడేమో పది కేజీలు పదిహేను కేజీల తరుగు తీస్తున్నారు.
Also Read : Shalini Pandey: ప్రీతి.. నువ్వు ఈ రేంజ్ లో చూపిస్తే కుర్రాళ్ల పరిస్థితి ఏంటి..?
Also Read
నేను వస్తున్నా అని కేంద్రాలకు హడావుడిగా బస్తాలు పంపి కాంటాలు వేస్తాం ఎవరూ పోవద్దని రైతులకు చెబుతున్నారు’ అని ఈటల అన్నారు. దీంతో పాటు.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మద్దతు గా ఈటల రాజేందర్ కామెంట్స్ చేశారు. గత 13 రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తుతుందని, ఇచ్చిన హామీ అమలు చేయాల్సిన చోయి ప్రభుత్వం మరిచి పోయిందన్నారు. ‘చిన్న ఉధ్యోగుల మీద ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది.. పంచాయతీ కార్యదర్శులు చేసిన కృషికి రాష్ట్రానికి మంచి పేరొఛ్చింది…గ్రామాల్లో రోజుకు 14 గంటలు పనిచేస్తున్న జెపిఎస్ లను అబినందించాల్సిన ప్రభుత్వం బెదిరిస్తుంది… జెపిఎస్ లు చిన్న ఉద్యోగులే కావచ్చు కానీ ప్రజల మద్దతు వారికుంది… పంచాయతీ కార్యదర్శులను అవమానిస్తే ప్రజలను అవమానించినట్లే…. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి…. మీ సమ్మె కు బిజెపి అండగా ఉంటుంది…. పంచాయతీ సెక్రటరీలు ఒంటరి కాదు వారి తరుపున అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం… కేసీఆర్ ప్రభుత్వానికి పోయే కాలం దెగ్గరకు వచ్చింది’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
-
Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
-
Tamil Nadu: విజయ్తో టచ్లోకి అన్నాడీఎంకే..
-
End of Left Rule: దేశ రాజకీయాల్లో ఒక శకం ముగింపు.. కనుమరుగవనున్న ఎర్రజెండా?
-
Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!