Etela Rajender : బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒకే తాను ముక్కలు
- రేవంత్ రెడ్డి హైదరబాద్ లో ఒకటి కాదు 50 మీటింగ్ లు పెట్టుకొని
- వైఫల్యాల నుండి తప్పించుకునేందుకు ఈ మీటింగ్ లు
- మోడీ ఎవరికి అన్యాయం చేయడు : ఈటల రాజేందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) , కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి చేశారు. ఈ రెండు పార్టీలూ ఒకే తాను ముక్కలు అని, ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో అనేక సమావేశాలు నిర్వహించడం వెనుక వైఫల్యాలను దాచిపెట్టే ఉద్దేశమే ఉందని ఈటల అన్నారు. హైదరాబాద్లో ఒకటి కాదు, ఏకంగా 50 మీటింగ్లు పెట్టినా, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధికి కంటే రాజకీయ ప్రచారానికే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.
తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దీనిపై కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజలు అవగాహనతో ఉండాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనలో రాష్ట్రాల ఆదాయంలో నష్టం జరుగుతోందన్న ఆరోపణలను ఈటల ఖండించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు పన్నుల్లో వాటా పెరిగిందని, మౌలిక సదుపాయాల కోసం మరింత నిధులు అందుతున్నాయని పేర్కొన్నారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఉత్తర ప్రదేశ్ వంటి పేద రాష్ట్రాలకు కేంద్రం అధిక నిధులు కేటాయిస్తోందన్న ఆరోపణలపై ఈటల స్పందిస్తూ, అభివృద్ధి లోపించిన ప్రాంతాలకు ఎక్కువ సహాయం అందించడం తప్పేమీ కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసగించేందుకు చూస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి నిధులు తగ్గించారన్న ఆరోపణలు నిరాధారమని, రైల్వే, రోడ్లు, ఇతర మౌలిక వసతుల కలయిక వల్ల రాష్ట్రాలకు మరింత అభివృద్ధి జరుగుతోందని ఈటల వివరించారు.
భారతదేశం గట్టి రక్షణ వ్యవస్థను కలిగి ఉందని, పాకిస్తాన్లోని పరిస్థితులను చూస్తే మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ముందుజాగ్రత్తలు అర్థమవుతాయని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అవినీతి తారాస్థాయికి చేరిందని ఈటల విమర్శించారు. కర్ణాటకలో ప్రస్తుతం 40% కమిషన్ ప్రభుత్వం నడుస్తోందని, ఇది ప్రజలకు తెలిసిందేనని తెలిపారు.
మూసీ నది ప్రక్షాళన గురించి తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని ఈటల స్పష్టం చేశారు. మూసీ నది శుభ్రంగా ఉంచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మాత్రమే మాట్లాడానని, రేవంత్ రెడ్డి పేర్కొన్న సుందరీకరణ గురించి కాదని స్పష్టం చేశారు.
Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లకు చుక్కలే.. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..