Site icon NTV Telugu

Etela Rajender : బీఆర్ఎస్‌కు బీజేపీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది

Etela

Etela

కోరుట్లో నేడు ధర్మపురి అర్వింద్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కు బీజేపీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన వెంటనే షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తానని మాట ఇచ్చిన కేసీఆర్… ఇక్కడి రైతులకు మాట ఇచ్చి తప్పారన్నారు. బీఅర్ఎస్ పార్టీ బతికున్నంత వరకు కేసిఆర్, కేటీఆర్ లేదా ఆయన మనుమడు మాత్రమే ముఖ్యమంత్రి అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Bigg Boss Telugu 7: విశ్వరూపం చూపించిన శివాజీ.. గేటు తీయండి బయటికి పోతా అన్న గౌతమ్

బీజేపీ 2 శాతం ఓట్లు లేవు ముఖ్యమంత్రి ఎలా అవుతారు అని రాహూల్ గాంధీ అంటాడని, హుజరాబాద్ లో ఎన్ని ఓట్లు వచ్చాయి, దుబ్బాక లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాలేదన్నారు. సచ్చి పోయిన కాంగ్రెస్ పార్టీని కొన్ని మీడియా సంస్థలు లేపుతున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ బీసీ ముఖ్యమంత్రి గానీ ఎస్సీ ముఖ్యమంత్రిని చేయలేదన్నారు ఈటల రాజేందర్‌. పేరుకే అన్ని వర్గాల పార్టీ అంటారు.. అధికారం మాత్రం ఒకే వర్గానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. ఈటల రాజేందర్ మాట్లాడుతుండగా సీఎం, సీఎం అంటూ కార్యకర్తల నినాదాలు చేశారు.

Also Read : D.K.Shivakumar: ఎప్పుడూ మమ్మల్ని తలుచుకోనిదే కేసీఆర్ నిద్రపోడు

Exit mobile version