Etela Rajender : భారత ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ ఊరికే రాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరుల స్మారకార్థం మేరీ మిట్టీ మేరా దేశ్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా అమరుల స్మారకార్థం దేశంలోని లక్షలాది గ్రామాల్లో శాసనాలు ఏర్పాటు చేస్తామని మన్ కీ బాత్లో మోడీ వెల్లడించారు. అంతేకాకుండా అమృత్ కలశ్ యాత్రను నిర్వహిస్తామన్నారు. ఇందులో దేశం నలు మూలల నుంచి 7500 కలశాల్లో మట్టిని సేకరించి ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ముగింపు పలుకుతామని పేర్కొన్నారు. అయితే.. ఈ క్రమంలోనే నేడు “మేరీ మిట్టి – మేరా దేశ్” కార్యక్రమంలో భాగంగా.. హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మట్టిని సేకరించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. భారత ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ ఊరికే రాలే అని వ్యాఖ్యానించారు. వందల సంవత్సరాలు విదేశీ దాష్యాసుంఖలాల విముక్తి కోసం లక్షలాది మంది అసువులు బాసారని ఆయన గుర్తు చేశారు. కొట్లాది మంది జైలు పాలయ్యారని ఆయన వెల్లడించారు. స్వాతంత్ర త్యాగల గుర్తులుగా ఢిల్లీలో ఒక స్ఫూర్తి వనం ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి గ్రామ, మండలం, పట్టణాల నుండి మేరీ మట్టి మేరీ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈటల రాజేందర్.
Also Read : Bussiness Tips : కేవలం రూ.20 పెట్టుబడి పెడితే చాలు.. రూ.5 లక్షలు పొందవచ్చు..
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
ఇదిలా ఉంటే.. ఇటీవల ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గజ్వేల్ ప్రజలు ఈ దఫా ఓటేయరనే భయంతో కేసీఆర్ కామారెడ్డికి పారిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.బుధవారంనాడు మెదక్ లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ ఏనాడూ ముఖం చూపించలేదన్నారు. గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కేసీఆర్ లాక్కున్నారని ఆయన ఆరోపించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చేసిన వాగ్దానాన్ని కేసీఆర్ అమలు చేయలేదని కేసీఆర్ పై ఈటల రాజేందర్ విమర్శలు చేశారు.
Also Read : Manchu Lakshmi: మనోజ్ కు పెళ్లి చేసినందుకు.. లక్ష్మీని దూరం పెట్టిన విష్ణు.. ?
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!