Etela Rajender : భారత ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ ఊరికే రాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరుల స్మారకార్థం మేరీ మిట్టీ మేరా దేశ్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా అమరుల స్మారకార్థం దేశంలోని లక్షలాది గ్రామాల్లో శాసనాలు ఏర్పాటు చేస్తామని మన్ కీ బాత్లో మోడీ వెల్లడించారు. అంతేకాకుండా అమృత్ కలశ్ యాత్రను నిర్వహిస్తామన్నారు. ఇందులో దేశం నలు మూలల నుంచి 7500 కలశాల్లో మట్టిని సేకరించి ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ముగింపు పలుకుతామని పేర్కొన్నారు. అయితే.. ఈ క్రమంలోనే నేడు “మేరీ మిట్టి – మేరా దేశ్” కార్యక్రమంలో భాగంగా.. హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మట్టిని సేకరించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. భారత ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ ఊరికే రాలే అని వ్యాఖ్యానించారు. వందల సంవత్సరాలు విదేశీ దాష్యాసుంఖలాల విముక్తి కోసం లక్షలాది మంది అసువులు బాసారని ఆయన గుర్తు చేశారు. కొట్లాది మంది జైలు పాలయ్యారని ఆయన వెల్లడించారు. స్వాతంత్ర త్యాగల గుర్తులుగా ఢిల్లీలో ఒక స్ఫూర్తి వనం ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి గ్రామ, మండలం, పట్టణాల నుండి మేరీ మట్టి మేరీ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈటల రాజేందర్.
Also Read : Bussiness Tips : కేవలం రూ.20 పెట్టుబడి పెడితే చాలు.. రూ.5 లక్షలు పొందవచ్చు..
Also Read
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
- Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ఇదిలా ఉంటే.. ఇటీవల ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గజ్వేల్ ప్రజలు ఈ దఫా ఓటేయరనే భయంతో కేసీఆర్ కామారెడ్డికి పారిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.బుధవారంనాడు మెదక్ లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ ఏనాడూ ముఖం చూపించలేదన్నారు. గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కేసీఆర్ లాక్కున్నారని ఆయన ఆరోపించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చేసిన వాగ్దానాన్ని కేసీఆర్ అమలు చేయలేదని కేసీఆర్ పై ఈటల రాజేందర్ విమర్శలు చేశారు.
Also Read : Manchu Lakshmi: మనోజ్ కు పెళ్లి చేసినందుకు.. లక్ష్మీని దూరం పెట్టిన విష్ణు.. ?
తాజావార్తలు
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!