Etela Rajender: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల.. అమిత్ షాతో భేటీ అనంతరం ప్రకటించే చాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించనున్నట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటలను నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జి.కిషన్ రెడ్డికి మళ్లీ కేంద్ర కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ను నియమించి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం తనకు అత్యంత సన్నిహితులైన అస్సాం సీఎం, హైకమిషనర్ హిమంత బిస్వాతో ఈటల భేటీలో జాతీయ నాయకత్వం ఆలోచనలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. అంతకుముందు అమిత్ షా కూడా ఈటల ఫోన్ లో మాట్లాడి ఈ అంశాలను వివరించిన సంగతి తెలిసిందే.
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
Read also: Weather Updates: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు..
తెలంగాణ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పుంజుకున్నదని.. పార్టీ శ్రేణులను పూర్తిగా కలుపుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని వారిద్దరూ సూచించినట్లు సమాచారం. ఈటల రాజేందర్ మొదట కేంద్ర మంత్రి పదవిని ఆశించారు. అయితే పార్టీ అగ్రనాయకత్వంతో ఒప్పించి రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధమైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు.
దాదాపు ఇరవై ఏళ్లుగా టీఆర్ఎస్లో కేసీఆర్ కేబినెట్లో నంబర్ టూగా గుర్తింపు పొందిన సందర్భంలోనూ, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఈటలకి ఉన్న విస్తృత పరిచయాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, సమర్ధవంతమైన నేతగా ఆయనకున్న ఇమేజ్ రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈటలకు గుర్తింపు రావడంతోపాటు వివిధ సామాజికవర్గాలతో ముఖ్యంగా బీసీ వర్గాలు, వర్గాలతో సత్సంబంధాలు ఉండడం కూడా బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.
IND vs PAK: టీ20ల్లో భారత్ చెత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!