Israel-Hamas War: భారతీయుల కోసం ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నంబర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య నిరంతర యుద్ధం జరుగుతోంది. ఇదిలావుండగా.. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో మంగళవారం జరిగిన క్షిపణి దాడిలో భారతీయ పౌరుడు మరణించాడు. మరో ఇద్దరు భారతీయులు గాయపడ్డారు. ఈ దాడి జరిగిన ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయ ప్రజలకు భద్రతా సలహాను జారీ చేసింది. దీంతో పాటు ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నంబర్ను కూడా విడుదల చేశారు. తద్వారా ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు ఈ నంబర్ను సంప్రదించి సహాయం కోరవచ్చు.
ఇజ్రాయెల్లో క్షిపణి దాడిలో భారతీయ పౌరుడు మరణించిన తరువాత, అక్కడ నివసిస్తున్న తన పౌరుల భద్రత గురించి భారత ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకే మంగళవారం భారతీయ పౌరులకు ఒక సలహా జారీ చేయబడింది. ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఇజ్రాయెల్ను కోరింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని విజ్ఞప్తి చేస్తూ భారత రాయబార కార్యాలయం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయ పౌరులందరూ, ముఖ్యంగా ఉత్తర, దక్షిణ సరిహద్దులో నివసించే వారు ఇజ్రాయెల్లోని సురక్షితమైన అంతర్గత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
Also Read
Read Also: Tragedy: అమెరికా వెళ్లేందుకు అంతా రెడీ.. ఇంతలోనే అనంతలోకాలకు..
ఇక్కడ, భారత ప్రభుత్వం తన పౌరుల భద్రతను నిర్ధారించడానికి భారత రాయబార కార్యాలయం ద్వారా ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇజ్రాయెల్కు చెందిన ఇమ్మిగ్రేషన్ అథారిటీ హాట్లైన్ నంబర్ను కూడా రాయబార కార్యాలయం జారీ చేసింది. ఈ నంబర్ 1700707889. అత్యవసర హెల్ప్లైన్ నంబర్ +972-35226748, ఇమెయిల్ ID- CONS1.telaviv@mea.gov.in కూడా జారీ చేయబడింది. సమస్యల్లో ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా దీన్ని సంప్రదించవచ్చు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రత గురించి ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, అందుకే పౌర భద్రతకు సంబంధించి స్థానిక అధికారులతో నిరంతర చర్చలు జరుగుతున్నాయి.
క్షిపణి దాడిలో కేరళ యువకుడు మృతి
కేరళలోని కొల్లంకు చెందిన నిబిన్ మాక్స్ వెల్ అనే యువకుడు క్షిపణి దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. అతను ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో ఒక పొలంలో పనిచేస్తుండగా జరిగిన క్షిపణి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అతను రెండు నెలల క్రితమే అక్కడికి వెళ్లాడని మాక్స్వెల్ తండ్రి చెప్పాడు. మరణించిన మాక్స్వెల్ అన్నయ్య కూడా ఇజ్రాయెల్లో నివసిస్తున్నాడు. అదే క్షిపణి దాడిలో మాక్స్వెల్ మరణించగా, కేరళకు చెందిన మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని బుష్ జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్గా గుర్తించారు. నాలుగు రోజుల తర్వాత అతని మృతదేహం భారత్కు చేరుకుంటుందని మాక్స్వెల్ తండ్రి తెలిపారు.
తాజావార్తలు
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
-
SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!