Elon Musk: ట్విట్టర్ చీఫ్ మాస్టర్ ప్లాన్.. వారికి డబ్బులే డబ్బులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: వ్యాపారం ఎలా చేయాలంటే ట్విట్టర్ చీప్ ఎలాన్ మస్క్ను చూసి నేర్చుకోవాలి.. ఇప్పుడు ఆయన సంపాదించుకోవడమే కాదు.. తనను నమ్ముకున్నవారు కూడా నాలుగు రాళ్లు వెనుకేసుకునే స్కెచ్ వేశారు.. ఇప్పటికే పలు కీలక నిర్ణయాతో ట్విట్టర్లో సంస్కరణలు తీసుకొచ్చిన ఆయన.. ఇప్పుడు వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్కు డబ్బులు చెల్లించనున్నట్టు వెల్లడించారు. కంటెంట్లో డిస్ప్లే అయ్యే యాడ్స్ ఆధారంగా ఈ చెల్లింపులు చేయనున్నట్టు ప్రకటించారు. రానున్న కొద్ది వారాల్లో ఈ చెల్లింపుల ప్రక్రియ మొదలు పెడతామని తెలిపారు ట్విట్టర్ చీఫ్.
ప్రపంచ కుభేరుడు, ట్విట్టర్ యజమాని అయిన మస్క్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఈ రాబోయే ఫీచర్ను ప్రకటించారు, దీనితో పాటుగా దాదాపు 5 మిలియన్ డాలర్లు అంటే రూ.41.2 కోట్లు ప్రారంభ చెల్లింపు బ్లాక్ను వెల్లడించారు. మస్క్ తన ట్వీట్లో, వెరిఫైడ్ ఖాతాదారులై కంటెంట్ క్రియేటర్స్ మాత్రమే ఈ ప్రోగ్రామ్కు అర్హులు మరియు ధృవీకరించబడిన వినియోగదారులకు అందించబడిన ప్రకటనలు ఖాతాలోకి వస్తాయని పేర్కొన్నాడు. ప్రకటనకర్తలను నిలుపుకోవడంలో ట్విట్టర్ సవాళ్లను ఎదుర్కొంటోంది, ప్రత్యేకించి కంపెనీ యొక్క గణనీయమైన ఉద్యోగుల తొలగింపుల తర్వాత ప్రకటన నియామకం గురించి ఆందోళనల కారణంగా ఈ చర్య వచ్చిందంటున్నారు విశ్లేషకులు.. మస్క్ తాజా నిర్ణయం ప్రకారం యూట్యూబర్స్ మాదిరిగా ట్వీపుల్ కూడా తమ కంటెంట్లో రిప్లై సెక్షన్లో డిస్ప్లే అయ్యే యాడ్స్ ప్రకారం డబ్బులు సంపాదించే వెసులుబాటు ఉంటుంది.
Also Read
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
ఎలాన్ మస్క్ గత అక్టోబర్లో ట్విటర్ను కొనుగోలు చేసినప్పటి నుండి ఆ సంస్థలో అనేక మార్పులు తీసుకువచ్చారు.. సీఈవో సహా టాప్ క్యాడర్ను కొంతమంది ఉద్యోగులను ఇంటికి పంపిన ఆయన.. అనూహ్యంగా వెరిఫైడ్ ఖాతాలకు డబ్బులు కూడా వసూలు చేయడం మొదలు పెట్టారు.. అయితే,ప్రకటనదారుల నుంచి పెనుసవాళ్లను ఎదుర్కొంటోంది ఈ సోషల్ మీడియా దిగ్గజం.. మరోవైపు ట్విటర్ సీఈవోగా అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ లిండా యాకారినో పదవి చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రకటనల పరిశ్రమలో ఆమెకున్న విస్తృతమైన నేపథ్యం , సరికొత్త వ్యూహాలతో భారీ ఆదాయ సమకూరనుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు..
తాజావార్తలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!