సీఎం కేసీఆర్ కీలక సమీక్ష.. 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ మహమ్మారి కారణంగా గత ఏడాది నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. మధ్యలో కొంతకాలం మినహా దాదాపు 18 నెలలుగా ఆన్లైన్ పద్ధతిలోనే విద్యా బోధన సాగుతోంది.. అయితే, ప్రత్యక్ష బోధనకు అనుమతించాలంటూ విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.. కోవిడ్ తీవ్రత తగ్గిందని, విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించేందుకు సరైన వాతావరణం నెలకొందని వైద్య ఆరోగ్య శాఖ సైతం పేర్కొంది. పలు ఇతర రాష్ట్రాలు ఇప్పటికే కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యక్ష బోధన ప్రారంభించాయని.. ఆన్లైన్ పాఠాలు ఫలితాన్ని ఇవ్వకపోవడం, ఇతరత్రా కారణాలతో కొందరు తల్లిదండ్రులు కూడా ప్రత్యక్ష బోధన వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.. దీంతో.. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై దృష్టిసారించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష క్లాసులను ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు.. విద్యా సంస్థలు తెరవొచ్చని ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ నివేదిక కూడా ప్రభుత్వానికి చేరింది.. మరోవైపు తాజా పరిస్థితులపై విద్యాశాఖ నుంచి కూడా సీఎం కేసీఆర్కు ఇవాళ నివేదిక అందించనట్టుగా చెబుతున్నారు. ఇక, ప్రత్యక్ష తరగతులను ప్రారంభిస్తే.. మొదట 9, 10 తరగతులతో పాటు, ఇంటర్, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి అనుమతులివ్వడం మేలని ప్రభుత్వానికి నివేదించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి, అవసరమైతే మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని కింది తరగతులకు అనుమతులిస్తే శ్రేయస్కరమని భావిస్తున్నట్టు విద్యాశాఖ చెబుతోంది.. విద్యాశాఖ తాజా ప్రతిపాదనల మేరకు.. 1–8 తరగతుల విద్యార్థులకు మరికొంత కాలం ఆన్లైన్లోనే విద్యాబోధన జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.. అయితే, దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు కొందరి నుంచి వ్యతిరేకత కూడా ఉందంటున్నారు. ఒకటి నుంచి ఎనిమిది తరగతుల్లో ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై విద్యాశాఖ ఒకింత విముఖంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది.. థర్డ్ వేవ్పై ఊహాగానాల నేపథ్యంలో ఈ దిశగా చర్యలు సరైనవి కావనే అభిప్రాయాలున్నాయి.. వీటి అన్నింటిపై సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో చర్చించి ఒక నిర్ణయానికి రానున్నట్టుగా తెలుస్తోంది.
Also Read
- G7 Summit: ఉక్రెయిన్కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్సిగ్నల్
- Meloni: జీ 7 సదస్సులో ధూమపానంపై ఆసక్తికర సంభాషణ.. మెలోనికి అభినందనలు
- IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
- Twisha Sharma: ఇంకా బయటకు రాని ట్విషా శర్మ రెండో పోస్ట్మార్టం రిపోర్ట్.. కారణమిదేనా?
తాజావార్తలు
-
G7 Summit: ఉక్రెయిన్కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్సిగ్నల్
-
Anil Ravipudi: రేపే అనిల్ రావిపూడి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
Kitchen Hacks: వర్కింగ్ ఉమెన్స్ కోసం కిచెన్ సీక్రెట్స్.. ఈ చిట్కాలతో వంట పని ఇక చిటికెలోనే!
-
Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
-
IND Vs AFG: వీర విహారం చేసిన టీమిండియా బ్యాటర్స్.. ఆఫ్ఘనిస్థాన్ ముందు కొండంత టార్గెట్..
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!