Delhi Excise Policy Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరొకరు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Excise Policy Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని జోర్ బాగ్కు చెందిన మద్యం పంపిణీ సంస్థ ఇండోస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్రును ఈరోజు ఉదయం ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మహేంద్రును మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రాత్రి సుదీర్ఘ ప్రశ్నోత్తరాల అనంతరం అరెస్టు చేసినట్లు తెలిసింది. అతనిని స్థానిక కోర్టులో హాజరుపరచాలని భావిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ డిప్యూటీ సీఎం సిసోదియా సహాయకుడు విజయ్ నాయర్ను సీబీఐ అరెస్టు చేసిన ఒకరోజు తర్వాత సమీర్ మహేంద్రు అరెస్ట్ కావడం గమనార్హం. ఈ విధానం వల్ల మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.
విజయ్ నాయర్తో పాటు మరో 14 మందికి మద్యం కుంభకోణంతో సంబంధాలు ఉన్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. వీరిలో వివిధ ఇంటర్నెట్ ఫ్లాట్ఫామ్లలో కామెడీ షోలు నిర్వహించే సంస్థలు కూడా ఉన్నట్లు చెబుతోంది. వీటిలో విజయ్ నాయర్తో సంబంధం ఉన్న కంపెనీలు కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఇది దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భయపడి, రాజకీయంగా ఆయన్ను దెబ్బతీసేందుకు భాజపా ప్రభుత్వం చేస్తున్న కుట్రగా ఆప్ ఆరోపిస్తోంది. ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయంగా కేజ్రీవాల్ ఎదుగుతున్నారన్న ఉద్దేశంతోనే బీజేపీ కుటిల యత్నాలు చేస్తోందని మండిపడుతోంది.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
Manchireddy Kishan Reddy: రెండో రోజు ఈడీ ముందుకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు ప్రభుత్వోద్యోగులు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీ, అసిస్టెంట్ కమిషనర్ పంకజ్ భట్నాగర్ ఉన్నారు.ఇతర నిందితులు పెర్నోడ్ రికార్డ్ మాజీ ఉద్యోగి మనోజ్ రాయ్, బ్రిండ్కో సేల్స్ డైరెక్టర్ అమన్దీప్ ధాల్, బడ్డీ రిటైల్ డైరెక్టర్ అమిత్ అరోరా, దినేష్ అరోరా, మహాదేవ్ లిక్కర్స్ సన్నీ మార్వా, అరుణ్ రామచంద్ర పిళ్లై, అర్జున్ పాండేలు ఉన్నారు. ఎక్సైజ్ పాలసీని సవరించేటప్పుడు అవకతవకలు జరిగాయని, లైసెన్స్ హోల్డర్లకు అనవసరమైన ప్రయోజనాలు కల్పించారని ఈడీ ఆరోపించింది.
తాజావార్తలు
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!