Deputy CM Pawan Kalyan: నామినేటెడ్ పోస్టులపై పవన్ కీలక వ్యాఖ్యలు.. నాగబాబుకు పదవి..!?
- నామినేటెడ్ పోస్టులపై పవన్ కీలక వ్యాఖ్యలు..
- పార్టీ కోసం కష్టపడిన వారిని మర్చిపోను..
- ప్రతి ఒక్కరూ ఛైర్మన్ పదవులు ఆశిస్తే కష్టం..
- కొందరు టీటీడీ ఛైర్మన్ సహా ఇంకొన్ని ఛైర్మన్ల పదవులు అడగుతున్నారు..
- నా కుటుంబ సభ్యులెవరూ టీటీడీ ఛైర్మన్ పదవి అడగలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: నామినేటెడ్ పోస్టుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… జనసేన కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులను సత్కరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వారిని మర్చిపోమని స్పష్టం చేశారు.. హరిప్రసాద్ కు గుర్తింపు లభించినట్టే అందరికీ గుర్తింపు ఉంటుందన్న ఆయన.. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి.. కానీ, ప్రతి ఒక్కరూ ఛైర్మన్ పదవులు ఆశిస్తే కష్టం. కొందరు టీటీడీ ఛైర్మన్ సహా ఇంకొన్ని ఛైర్మన్ల పదవులు అడగుతున్నారు. ఒక్క టీటీడీ ఛైర్మన్ పదవి కోసమే 50 మంది అడిగారు.. కానీ, ఆ పదవి ఒక్కరికే ఇవ్వగలరు. అయితే, నా కుటుంబ సభ్యులెవరూ టీటీడీ ఛైర్మన్ పదవి అడగలేదు.. కానీ, నా కుటుంబ సభ్యులు టీటీడీ ఛైర్మన్ పదవి అడిగారని ప్రచారంలో పెట్టారు.. అది కరెక్ట్ కాదు.. అని హితవుపలికారు.
Read Also: OTT release: ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగు పెడుతున్న సుధీర్ బాబు సినిమా..ఎప్పుడు ఎక్కడంటే..?
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
ఈ పదవుల కోసం చంద్రబాబుని ఎలా అడగాలో తనకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్.. మీకిది చేశాం కాబట్టి.. మాకు ఈ పదవి ఇవ్వండి అని అడగలేం.. కానీ, అందరికీ న్యాయం చేసేలా నా వంతు ప్రయత్నం చేస్తా అన్నారు.. ఇదే సమయంలో ఎవరికైనా పదవి ఇవ్వలేకుంటే పెద్ద మనస్సుతో ఆలోచించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీని నేనూ కేబినెట్ పదవి అడగగలను.. కానీ, నేను అడగలేదు. పదవుల కోసం మనం పని చేయడం లేదు. ఎవరైనా ఏమైనా పదవి కావాలంటే అడగండి.. కమిటీలో చర్చించి పదవులిచ్చే ప్రయత్నం చేస్తాం అన్నారు. పదవులు అడిగే వాళ్లు.. వాళ్ల అనుభవాలను.. వారి అర్హతలకు దగ్గరగా ఉండే పదవులు అడగండి. లా అండ్ ఆర్డర్ విషయంలో అందరూ ఆలోచన చేయాలన్నారు.. నంద్యాల ఘటనల్లాంటివి జరగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. ఇక, మనోహర్ సివిల్ సప్లైస్ శాఖను సమర్ధవంతంగా పని చేస్తున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం కట్టడికి నాదెండ్ల చర్యలు తీసుకుంటున్నారు. కేబినెట్లో రేషన్ అక్రమాలు సహా.. రాష్ట్రాభివృద్ధి కోసం చర్చిస్తాం అన్నారు. మరోవైపు.. కేంద్రంలోకి రావాలని.. మంత్రి పదవి ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కానీ, రాష్ట్రంలోనే ఉంటానని చెప్పాను. అడగాల్సిన టైంలో రాష్ట్రం కోసం ప్రధానిని అడుగుతా.. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి, రైల్వే జోన్, 20 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలను అడుగుతా అని వ్యాఖ్యానించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?