Election Commission: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రూ.1760 కోట్లు పట్టివేత.. తెలంగాణలోనే అత్యధికం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: ఐదు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ.1,760 కోట్ల విలువైన ఉచితాలు, డ్రగ్స్, నగదు, మద్యం, విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. 2018లో ఈ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జప్తు చేసిన జప్తుల కంటే ఏడు రెట్లు (గత ఎన్నికల్లో రూ. 239.15 కోట్లు) ఎక్కువ జప్తు చేసినట్లు పోల్ ప్యానెల్ తెలిపింది. ఈ వివరాలను అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలంగాణలో అత్యధికంగా 225.25 కోట్ల నగదును సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, రాజస్థాన్, తెలంగాణలో నవంబర్ 25, నవంబర్ 30 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
Also Read: PM MODI: ఓటమి బాధలో టీమిండియా ఆటగాళ్లు.. డ్రెసింగ్ రూమ్కు వెళ్లి ఓదార్చిన ప్రధాని
Also Read
- Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
తెలంగాణలో మొత్తం 659 కోట్ల రూపాయల విలువ గల నగదు, మద్యం, డ్రగ్స్, గిఫ్ట్స్ పట్టుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. రాజస్థాన్లో 93.17 కోట్లు, మధ్యప్రదేశ్లో 33.72 కోట్లు, పట్టుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. మిజోరాంలో నగదు లేదా విలువైన లోహం స్వాధీనం చేసుకోలేదు, అయితే ₹ 29.82 కోట్ల విలువైన డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ముగిసే ఈ గణాంకాలు భారీగా పెరగనున్నాయి. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో చీఫ్ సెక్రటరీలు డీజీపీలు, ఎక్సైజ్ కమిషనర్లు, ఇన్కమ్ టాక్స్ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది. 228 మంది కేంద్ర ప్రభుత్వ ఉన్నత అధికారులను ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు అబ్జర్వర్లుగా నియమించింది. గతంలో నిర్వహించిన ఆరు రాష్ట్రాలు ఎన్నికల్లో వెయ్యి కోట్లు పట్టు పడగా… ఐదు రాష్ట్రాలకే ఇప్పుడు 1760 కోట్ల రూపాయలు విలువైన నగదు, మద్యం పట్టుబడినట్లు ఈసీ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!