Draupadi Murmu : తెలంగాణలో నా పర్యటన తీపి జ్ఞాపకంగా మిగులుతుంది
ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేట్ గ్రామంలోని రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందిన కాకతీయుల కాలం నాటి రుద్రేశ్వరాలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, అధికారులు హెలిప్యాడ్ వద్ద ఆమెకు స్వాగతం పలికారు. ఆమె కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి రాష్ట్రపతి శ్రీ రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత, ఆమె ‘తీర్థయాత్ర పునరుజ్జీవనం మరియు ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్’ (ప్రసాద్) పథకం కింద ప్రతిపాదించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో కామేశ్వర ఆలయ పునర్నిర్మాణానికి ‘భూమి పూజ’ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. తెలంగాణలో తన పర్యటన తీపి జ్ఞాపకంగా మిగులుతుందన్నారు. భద్రాద్రి రాముడి దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి వ్యాఖ్యలను రాష్ట్రపతి ప్రస్తావించారు. రామాయణంలో భద్రాచలానికి ప్రత్యేక అనుబంధం ఉందని రాష్ట్రపతి చెప్పారు.
Aslo Read : Prevent Pregnancy: సెక్స్ ఇలా చేస్తే పిల్లలు పుట్టరట
సీతారాములు, లక్ష్మణుడు ఇక్కడ కొంతకాలం గడిపారని తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాలకు వచ్చేవారి సంఖ్య బాగా పెరుగుతున్నదని వెల్లడించారు. ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి పర్యాటకశాఖ దృష్టి సారించిందన్నారు. గిరిజనుల అభివృద్ధికి వనవాసి కల్యాణ పరిషత్ ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు ద్రౌపది ముర్ము. అయితే.. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయ పునర్నిర్మాణం యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టినట్లు చెబుతారు. హన్మకొండలో ఉన్న ‘వెయ్యి స్తంభాల’ దేవాలయంలోని ‘మహా మండపం’ లాగానే, 33 మీటర్ల పొడవు మరియు 33 మీటర్ల వెడల్పుతో కామేశ్వర ఆలయ మండపం కూడా కాకతీయుల కాలంలోని ప్రత్యేకమైన ఇసుక-బాక్స్ సాంకేతికతను ఉపయోగించి పునర్నిర్మించబడుతుంది. అధికారుల ప్రకారం, పునర్నిర్మాణం మార్చి, 2026 నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్ చేయబడింది. రాష్ట్రపతి పర్యటనలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే దనసరి అనసూయ అనే సీతక్క, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాష్ రావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!