Andhra Pradesh Crime: ఇన్సూరెన్స్ డబ్బు కోసం స్కెచ్.. చనిపోయినట్లు నాటకం.. చివరి ఏమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Crime: చనిపోయాడు అనుకున్న ఓ వ్యక్తి బతికే ఉన్నానని.. అప్పులు పాలైన ఓ రైతు సినిమా ఫక్కీలో భీమా సొమ్ము కోసం ఆడిన డ్రామా కేసు వెలుగు చూసింది.. ఈ కేసును చేధించిన పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు చూసి షాక్ తిన్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వాటిని తీర్చడానికి తాను చనిపోయినట్లు ఓ సినిమా తీసేంత స్థాయిలో భారీ స్కెచ్ వేశాడు. బీమా సొమ్ము కోసం చనిపోయి నట్లు నమ్మించాలని అనుకున్నాడు. పథకం బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు..
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 26న గుర్తుతెలియని వ్యక్తి మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. కేతమళ్ల వెంకటేశ్వరరావు అలియాస్ పూసయ్య అనే వ్యక్తి.. వీరంపాలెంలో ధాన్యం వ్యాపారి. వివిధ అవసరాల కోసం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేశాడు.. అవి తీర్చలేని పరిస్థితి వచ్చింది.. దీంతో, వాటి నుంచి బయటపడేందుకు తానే చనిపోయినట్టు చిత్రీకరించి.. కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళితే తన పేరిట రూ.40లక్షల బీమా సొమ్ము వస్తుందని ఆశించారు.. దాని కోసం ప్రమాదవశాత్తు మరణించినట్టు అందరినీ నమ్మించడానికి ప్లాన్ చేశాడు.. అతడి స్థానంలో వేరే మృతదేహాన్ని ఉంచి ఎవరూ గుర్తించకుండా చేయాలని భావించాడు. ఇక, ఆ డెడ్బాడీ కోసం మోరంపూడికి చెందిన ఇద్దరు యువకులతో డీల్ చేసుకున్నాడు..
Also Read
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
అయితే, పాత బొమ్మూరులో ఈ నెల 23వ తేదీన ఓ వ్యక్తి చనిపోయాడు.. మరుసటిరోజు బంధువులు స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించి.. మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ విషయాన్ని విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులు.. పూడ్చిపెట్టిన ఆ మృతదేహాన్ని 25వ తేదీన దొంగిలించారు. వీరయ్య చెప్పిన ప్లాన్ ప్రకారం.. ఆ మృతదేహాన్ని వీరంపాలెం తీసుకెళ్లి పొలంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్ద పెట్రోలు పోసి నిప్పుపెట్టారు.. ఆ ప్లేస్లో పూసయ్య చెప్పులతో పాటు సెల్ఫీని అక్కడే ఉద్దేశ్యపూర్వకంగా వదిలివెళ్లారు. ఇక, ఆధారాలనుబట్టి మృతదేహం పూసయ్యదే నని గ్రామస్థులు భావించి పోస్టుమార్టం కోసం తరలించారు. భర్త మరణించారని భావించి ఆయన భార్య తట్టుకోలేక తానూ చనిపోతానంటూ కన్నీరుమున్నీరైంది.. ఇక్కడ జరిగే విషయాలను ఎప్పటికప్పుడు ఆ ఇద్దరు యువకులు.. అజ్ఞాతంలో ఉన్న పూసయ్యకు వివరిస్తూ వచ్చారు..
ఇక, భార్య బాధను చూడలేక ఆమెకు.. ఎలాగైనా అసలు విషయాన్ని చెప్పాలని భావించి పూసయ్య.. మరో కొత్త స్కెచ్ వేశాడు.. గుర్తుతెలియని యువకులు ఎవరో పొలంలో ఓ మృతదేహాన్ని కాలుస్తుండగా తాను అడ్డుకున్నానని, దీంతో వారు తనను కొట్టి ఆటోలో తీసుకెళ్లారని.. ఆ తర్వాత తుప్పల్లో పడేసి వెళ్లారని చెప్పుకొచ్చాడు.. కానీ, అతడి శరీరంపై గాయాలు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఈ ఘటనలో అప్పడికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పూసయ్య మళ్లీ రావడంతో.. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. పూసయ్యతో పాటు అతడికి సహకరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?