Andhra Pradesh Crime: ఇన్సూరెన్స్ డబ్బు కోసం స్కెచ్.. చనిపోయినట్లు నాటకం.. చివరి ఏమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Crime: చనిపోయాడు అనుకున్న ఓ వ్యక్తి బతికే ఉన్నానని.. అప్పులు పాలైన ఓ రైతు సినిమా ఫక్కీలో భీమా సొమ్ము కోసం ఆడిన డ్రామా కేసు వెలుగు చూసింది.. ఈ కేసును చేధించిన పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు చూసి షాక్ తిన్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వాటిని తీర్చడానికి తాను చనిపోయినట్లు ఓ సినిమా తీసేంత స్థాయిలో భారీ స్కెచ్ వేశాడు. బీమా సొమ్ము కోసం చనిపోయి నట్లు నమ్మించాలని అనుకున్నాడు. పథకం బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు..
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 26న గుర్తుతెలియని వ్యక్తి మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. కేతమళ్ల వెంకటేశ్వరరావు అలియాస్ పూసయ్య అనే వ్యక్తి.. వీరంపాలెంలో ధాన్యం వ్యాపారి. వివిధ అవసరాల కోసం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేశాడు.. అవి తీర్చలేని పరిస్థితి వచ్చింది.. దీంతో, వాటి నుంచి బయటపడేందుకు తానే చనిపోయినట్టు చిత్రీకరించి.. కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళితే తన పేరిట రూ.40లక్షల బీమా సొమ్ము వస్తుందని ఆశించారు.. దాని కోసం ప్రమాదవశాత్తు మరణించినట్టు అందరినీ నమ్మించడానికి ప్లాన్ చేశాడు.. అతడి స్థానంలో వేరే మృతదేహాన్ని ఉంచి ఎవరూ గుర్తించకుండా చేయాలని భావించాడు. ఇక, ఆ డెడ్బాడీ కోసం మోరంపూడికి చెందిన ఇద్దరు యువకులతో డీల్ చేసుకున్నాడు..
Also Read
- FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
- FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
అయితే, పాత బొమ్మూరులో ఈ నెల 23వ తేదీన ఓ వ్యక్తి చనిపోయాడు.. మరుసటిరోజు బంధువులు స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించి.. మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ విషయాన్ని విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులు.. పూడ్చిపెట్టిన ఆ మృతదేహాన్ని 25వ తేదీన దొంగిలించారు. వీరయ్య చెప్పిన ప్లాన్ ప్రకారం.. ఆ మృతదేహాన్ని వీరంపాలెం తీసుకెళ్లి పొలంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్ద పెట్రోలు పోసి నిప్పుపెట్టారు.. ఆ ప్లేస్లో పూసయ్య చెప్పులతో పాటు సెల్ఫీని అక్కడే ఉద్దేశ్యపూర్వకంగా వదిలివెళ్లారు. ఇక, ఆధారాలనుబట్టి మృతదేహం పూసయ్యదే నని గ్రామస్థులు భావించి పోస్టుమార్టం కోసం తరలించారు. భర్త మరణించారని భావించి ఆయన భార్య తట్టుకోలేక తానూ చనిపోతానంటూ కన్నీరుమున్నీరైంది.. ఇక్కడ జరిగే విషయాలను ఎప్పటికప్పుడు ఆ ఇద్దరు యువకులు.. అజ్ఞాతంలో ఉన్న పూసయ్యకు వివరిస్తూ వచ్చారు..
ఇక, భార్య బాధను చూడలేక ఆమెకు.. ఎలాగైనా అసలు విషయాన్ని చెప్పాలని భావించి పూసయ్య.. మరో కొత్త స్కెచ్ వేశాడు.. గుర్తుతెలియని యువకులు ఎవరో పొలంలో ఓ మృతదేహాన్ని కాలుస్తుండగా తాను అడ్డుకున్నానని, దీంతో వారు తనను కొట్టి ఆటోలో తీసుకెళ్లారని.. ఆ తర్వాత తుప్పల్లో పడేసి వెళ్లారని చెప్పుకొచ్చాడు.. కానీ, అతడి శరీరంపై గాయాలు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఈ ఘటనలో అప్పడికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పూసయ్య మళ్లీ రావడంతో.. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. పూసయ్యతో పాటు అతడికి సహకరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్తో సినిమా రెండేళ్లు పోస్ట్పోన్
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
-
Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!