ధరణి బాధితులకు అండగా కాంగ్రెస్
పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ధరణి వల్ల ప్రజల కష్టాలపై చర్చ జరిగిందన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ధరణి వల్ల లక్షలాది మంది యజమానులు రికార్డులు పట్టుకొని బిచ్చగాళ్ల లాగా ఎమ్మార్వో ఆఫీస్ ల ముందు తిరుగుతున్నారని విమర్శించారు.
భూ సర్వే చేసి..రికార్డుల సవరణ చేయాల్సింది. ప్రభుత్వం అనాలోచితంగా ధరణి విధానాన్ని తీసుకొచ్చింది. ఎక్స్ సర్వీస్ మెన్ తమ భూమికి కూడా వాళ్ళు ఓనర్లుకాదని ధరణి చూపుతుంది. అనేక సర్వే నంబర్లు మిస్సయ్యాయి..మ్యుటేషన్ పోయింది.ధరణి బాధితులకు అండగా వారం రోజుల పాటు భూ పరిరక్షణ ఉద్యమం చేపడతామన్నారు శ్రవణ్.
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
మండల కేంద్రాల్లో భూ సమస్యలు ఎదుర్కొంటున్న ధరణి బాధితుల దగ్గర వినతి పత్రాలు స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వల దృష్టికి తీసుకెళ్తాం. ధరణి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎస్సీ ఎస్టీ ల అసైన్డ్ భూములను లాక్కున్నారు. ధరణి పోర్టల్ వల్ల సెక్యూరిటీ ఎంత వరకు ఉందని తెలియదు.భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ పెంచుతున్నామని ప్రభుత్వం చెప్తుంది..ప్రాజెక్టులకు లక్షల ఎకరాల భూమి లాక్కుంది..అప్పుడు భూముల విలువ ఆధారంగా లెక్కలు కట్టలేదు. దీంతో భూమి కోల్పోయిన బాధితులు నష్టపోయారు.
భూసేకరణ జరిగిన తరువాత ధరలు పెంచుతున్నామని ప్రజల నోట్లో మన్ను కొట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వ ఖజానా ను పెంచుకోవడానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటి కూడా పెంచాలని చూస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ధరణి బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే ప్రధాని ,రాష్ట్రపతిని కలుస్తామన్నారు.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!