Gedela Srinubabu: విజయనగరానికి పూర్వవైభవం.. చిరకాల స్వప్నం సాకారానికి మార్గం
విజయనగరం జిల్లాకి పూర్వవైభవం తీసుకురావడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని పల్సస్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీనుబాబు భరోసా ఇచ్చారు. విజయనగరం జిల్లా కేంద్రంలో 10 వేల మంది రైతులతో నిర్వహించిన సదస్సుకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సదస్సుకి ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకప్పుడు గలగలా పారే నదులు.. పచ్చని పంట పొలాలతో ఆంధ్రప్రదేశ్ కే మణిహారంగా విలసిల్లేది విజయనగరం. కాల ప్రవాహంలో విజయనగరం తన ప్రభావం కోల్పోయిందని అన్నారు. సహజవనరులు నిరుపయోగం కావడంతో ప్రజలు వలస బాట పట్టారని గేదెల శ్రీనుబాబు తెలిపారు.
స్థానిక స్వరం గేదెల శ్రీనుబాబు
ఉత్తరాంధ్ర ఉనికిని చాటింది పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు. వెనుకబాటు తనానికి కారణం ఎవరంటూ నిలదీశాడు. ప్రజల మనోభావాలను ప్రతిధ్వనించే స్థానిక గొంతు గేదెల శ్రీనుబాబు. ఉత్తరాంధ్రపై పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. సమృద్ధిగా ఉన్న సహజ వనరులు, మానవ వనరులను ఉపయోగించుకుంటే విజయపథంలో పయనించాల్సిన విజయనగరం ఇలా విషాదాల నగరంగా ఎందుకు ఉందని ప్రశ్నించాడు. నదులు ఎలా కనుమరుగయ్యాయని నిలదీస్తున్నాడు. అందుబాటులో ఉన్న భూమిలో 50 శాతం సాగుకు దూరం అవ్వడానికి కారణాలేంటని అడుగుతున్నాడు.
Also Read
వ్యవసాయ విప్లవానికి పిలుపు
వ్యవసాయానికి శాస్త్ర సాంకేతికతను అనుసంధానించడం ద్వారా పెనుమార్పులకు నాంది పలికే ఉద్యమం ఆరంభించాడు. వ్యవసాయ విప్లవానికి శ్రీకారం చుట్టాడు. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు, డిజిటలైజేషన్, రైతులకు AI- సంబంధిత శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని చాటిచెప్పాడు. రెండు రెట్లు అధికంగా రైతులకు ఆదాయాన్ని పెంచడం, గ్రామీణ యువత, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా తన విజన్ అమలుకు కృషి చేస్తున్నారు.
పాలకుల నిర్లక్ష్యం..ప్రజలకు శాపం
30 సంవత్సరాలుగా విజయనగరం తీరని అన్యాయానికి గురైందని గేదెల శ్రీనుబాబు అన్నారు. పాలకులు విజయనగరం గొప్ప సంస్కృతి, వారసత్వం, సహజ వనరులను విస్మరించారన్నారు. తత్పలితంగా పది లక్షల మంది వలసలకు దారితీసింది.. ప్రజల సంక్షేమం కంటే తమ కుటుంబ సంక్షేమంపై ఎక్కువ ఆసక్తి ఉన్న స్థానిక రాజకీయ నేతలే వలసలకి కారణం అని శ్రీనుబాబు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి
వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధితో స్థానికులకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని శ్రీనుబాబు తెలిపారు. రైతులకుపండించే పంటలకు మద్దతు ధరలను అందించాలని కోరారు. వ్యవసాయరంగంలో ఈ ప్రయత్నాలు సఫలం అయితే జిల్లా పూర్వవైభవానికి మార్గం ఏర్పడుతుంది.. విజయనగరం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన రైతులు సంప్రదాయ పంటలైన వరి, చెరకు వంటి సాధారణ పంటలపై ఆధారపడే స్థితిని విడిచిపెట్టి.. వాణిజ్య పంటలు, పప్పు దినుసులు, తృణధాన్యాలు సాగు అవలంబించాలని పేర్కొన్నారు.
విజయనగరం సానబెట్టాల్సిన వజ్రం
వజ్రం సానబెట్టకపోతే ఒక రాయి ముక్కలానే ఉంటుంది.. సానబెడితే కోట్ల విలువైన వజ్రం అవుతుందని శ్రీనుబాబు అన్నారు. విజయనగరం కూడా అపారమైన వనరులున్నాయి.. వీటిని వినియోగంలోకి తెస్తే అంతులేని సంపద సృష్టించొచ్చని తెలిపారు. ఉత్తరాంధ్రలో కీలకమైన విజయనగరం జిల్లాలో 30 రెవెన్యూ మండలాలు, 10 పట్టణాలు, 1000 గ్రామాలున్నాయి.. చరిత్రగల విజయనగరం, సంస్కృతి, కళల నిలయమైన విజయనగరం పూర్తిగా పాలకుల నిర్లక్ష్యానికి గురై గత కీర్తిని కోల్పోయిందని గేదెల శ్రీనుబాబు అన్నారు.
జిల్లా సాంస్కృతిక ప్రముఖులు
రాజా సాహెబ్ డా. పి.వి.జి. రాజు, శ్రీ గురజాడ, శ్రీ ఆదిభట్ల నారాయణ దాస్, కోడి రామమూర్తి, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. మహారాజా కళాశాల వంటి సంస్థలు విజయనగరం కీర్తిని ఇనుమడింపజేశారు.
అక్షరాస్యత గణాంకాలు
1879లో ఏర్పాటైన మహారాజా కళాశాల విద్య కుసుమాలు వ్యాపింపజేసింది.
2021 లెక్కల ప్రకారం 53.89% అక్షరాస్యత రేటు ఉంది.
జనాభాలో 68.15% పురుషులు, 49.87% స్త్రీలు ఉన్నారు.
సవాళ్లు ఎదుర్కొంటున్న ఆక్వా రంగం
విజయనగరంలో ఆక్వాకల్చర్ రంగం సవాళ్లను ఎదుర్కొంది. నాగావళి, గోస్తని, సువర్ణముఖి, చంపావతి, వేగావతి, గోముఖి వంటి నదులున్న జిల్లాలో అతి తక్కువ ఆక్వాకల్చర్ సాగవుతోంది. పూసపాటిరేగ మండలంలో అక్కడక్కడా ఆక్వా రంగం ఉనికి ఉంది.
వ్యవసాయం, విజయనగరం జీవనాడి
విజయనగరం జిల్లావాసుల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. 68.4% మంది కార్మికులు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. వర్షాధార వ్యవసాయం, అస్థిర వర్షపాతంపై ఆధారపడింది. నీటిపారుదల సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి.
పశు సంపద
పశువు సంపద సమృద్ధిగా ఉన్నప్పటికీ భవిష్యత్తు ప్రశ్నార్థకమే. 2023లో జరిగిన జనాభా గణన ప్రకారం పశువులు, గేదెలు, గొర్రెలతో సహా 23.70 లక్షల పశువులు ఉన్నాయి.
అటవీ సంపద
అటవీ ప్రాంతం భౌగోళిక విస్తీర్ణంలో 17.8%
సముద్ర వనరులు మరియు ఖనిజ సంపద
తీరప్రాంతం 28 కిలోమీటర్ల పొడవునా పూసపాటిరేగ, భోగాపురం వంటి గ్రామాల్లో 6,993 మంది మత్స్యకారులు ఉన్నారు. ఉప్పు సాగు భూములున్నాయి.
గనులు
అధిక-నాణ్యత గల మాంగనీస్, సున్నపురాయి మరియు క్వార్ట్జ్ వంటి ఖనిజాలను కూడా కలిగి ఉంది.
పర్యాటకం
విజయనగరం పునరుజ్జీవనానికి కీలకమైన టూరిజం. కోటలు, రాజభవనాలు, దేవాలయాలు, విజయనగరం కోట, మోతీ మహల్, అలకనంద ప్యాలెస్, తోటపల్లి బ్యారేజీ వంటివి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
నీటిపారుదల ప్రాజెక్టులు
ప్రధాన, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు విజయనగరం వ్యవసాయ పరివర్తనకు వెన్నెముక. 70,770 ఎకరాల ఆయకట్టుకి నీరందించే తోటపల్లి బ్యారేజీ ప్రధానమైంది. పెండింగ్లో ఉన్న సాగునీటిప్రాజెక్ట్లు పూర్తిచేస్తే లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి.
వ్యవసాయ భూమి వినియోగం- పంటలు
జిల్లాలో 69.13% భూమి వ్యవసాయం అనుకూలమైంది. ఇందులో 21.51% భూమిలో ఏడాదికి రెండు పంటలు పండుతాయి. ఎక్కువ వర్షాధారమే.
విజయనగరం పూర్వ వైభవం కోసం రోడ్ మ్యాప్
విజయనగరం సాధికారత, పూర్వ వైభవం కోసం గేదెల శ్రీనుబాబు ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇది కల కాదని, సాకారమయ్యే ఒక ఆశయమని ఆయన అన్నారు.
విజయనగరం జిల్లాకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని వనరులున్నాయని, చేయాల్సిన కృషి మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. వ్యవసాయ నైపుణ్యాన్ని ఉపయోగించడం ద్వారా, దాని రైతులకు అవగాహన కల్పించడం ద్వారా మరియు స్థానికంగా వ్యవసాయాధారిత, అనుబంధ పరిశ్రమలను స్థాపించడం ద్వారా విజయనగరం సాధికారిత సాధ్యం అవుతుందన్నారు.
విజయనగరం విశేషాలు-గణాంకాలు-వనరులు
1. విజయనగరం జిల్లాకు జిల్లా కేంద్రం విజయనగరం గా ఉంటూ అసెంబ్లీ నియోజకవర్గాలు రాజాం బొబ్బిలి చీపురుపల్లి నెల్లిమర్ల విజయనగరం శృంగవరపుకోట గజపతినగరంగా ఉన్నాయి. బొబ్బిలి చీపురుపల్లి విజయనగరం మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి మరియు 27 మండలాలు ఉన్నాయి.
2. బొబ్బిలి డివిజన్లో బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం, గజపతినగరం, దత్తరాజేరు, బొండపల్లి, మెంటాడ మండలాలు ఉన్నాయి.
3. చీపురుపల్లి డివిజన్లో చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, మెరకముడిదాం, వంగర, రేగిడి అందాలవలస, సంతకవిటి, రాజాం మండలాలు ఉన్నాయి.
4. విజయనగరం రెవెన్యూ డివిజన్లో మండలాలు విజయనగరం, గంట్యాడ, పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, శృంగవరపుకోట, జామి, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస ఉన్నాయి.
5. 4,122 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విజయనగరం ఉంటుంది దాదాపు 20 లక్షల మంది జనాభా ఉన్నారు.
6. విజయనగరం జిల్లాలో ప్రధానంగా 40కి పైగా పెద్ద పరిశ్రమలు, స్టీల్, ఫెర్రో, మిశ్రమాలు ఫార్మా, చెరుకు రసాయన జీడిపప్పు ప్రాసెసింగ్ మొదలైనవి ఉన్నాయి. వీటి ద్వారా దాదాపుగా ఒక 30 వేల మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. అలాగే 4 వేలకు పైగా చిన్న పరిశ్రమలు ఉన్నాయి.. ఈ చిన్న పరిశ్రమల ద్వారా ఇంకొక 40 వేల మందికి ఉపాధి దొరుకుతుంది.
7. ఇవే కాకుండా వ్యవసాయ ఆధారిత సేంద్రీయ కూరగాయలు పరిశ్రమలు స్థాపన,సుస్థిర ఆర్థిక వ్యవసాయ కారిడార్లు నిర్మించడం ద్వారా వచ్చే ఐదు సంవత్సరాలలో ఒక 50,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది.
8. కొత్తగా ఏర్పడిన విజయనగరం జిల్లాలో సాగుకు అనువైన భూములు దాదాపు నాలుగు లక్షల హెక్టార్లు ఉంటే సాగు విస్తరణం కేవలం మూడు లక్షల హెక్టార్లు. ఇందులో దాదాపు 1.75 లక్షల హెక్టార్లు వర్షాధారం 1.25 లక్షల హెక్టార్లకు జలాశయాలు చెలువులు కాలువలు ద్వారా సాగునీరు లభిస్తుంది.
9. 1990 నాటికి విజయనగరంలో 4.5 లక్షల మంది రైతులు మరియు 4 లక్షల మంది రైతు కూలీలు ఉంటే 2020 నాటికి దాదాపుగా 3 లక్షల మంది రైతులు 3.5 లక్షల రైతుకూలీలు ఉన్నారు. అంటే దాదాపుగా ఒక లక్ష మంది రైతుల కుటుంబాలు విజయనగరం నుంచి అంతరించిపోయాయి. అలాగే ఒక లక్ష రైతు కూలీల కుటుంబాలు విజయనగరం నుంచి అంతరించిపోయాయి.
10. 1990 కన్నా ముందు విజయనగరంలో 11 నియోజకవర్గాలు ఉంటే 1996 తర్వాత 9 నియోజకవర్గానే ఉన్నాయి. అంటే రెండు ఎమ్మెల్యే నియోజకవర్గాలు అంతరించిపోయాయి. అదే విధంగా శ్రీకాకుళంలో 12 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటే ఇప్పుడు కేవలం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే రెండు జిల్లాల్లో గత 20 సంవత్సరాలలో 4 ఎమ్మెల్యే నియోజకవర్గాలు అంతరించిపోయాయి.. 30 లక్షల మంది వలస పోయారు.
11. విజయనగరం జిల్లాలో వ్యవసాయమే ప్రధాన వృత్తి. దాదాపు 70 శాతం మంది ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. సాగు విస్తీర్ణంలో 60 శాతం మీద ఆహార పంటలు వరి సజ్జ రాగులు మరియు 40% మీద వాణిజ్య పంటలు చెరుకు వేరుశనగ గోగునారా పండిస్తున్నారు. ఈ వాణిజ్య పంటలను మరికొంచెం పెంచి ఉద్యాన పంటలైన మామిడి జీడి వంటివి కూడా మరి కొంచెం ప్రోత్సహించి, సేంద్రీయ కూరగాయలను కూడా పండించి ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ సెంటర్స్ ఏర్పాటుచేసి. డిజిటలైజేషన్ ద్వారా మార్కెటింగ్ చేసి అమ్మగలిగితే ఈ రంగంలో దాదాపు 50 వేల మందికి ఉపాధి కల్పించవచ్చు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?