India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- అంపైర్లు కూడా భారత్కే అనుకూలం..
- పాక్ ఆల్రౌండర్ వ్యాఖ్యలతో దుమారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: గ్రౌండ్లో భారత్ను జయించలేని పాకిస్తాన్ అనవసరపు ఆరోపణలు చేస్తోంది. ఐసీసీ టోర్నమెంట్లలో వరసగా భారత్ చేతిలో ఘోర పరాజయాలు పాలవుతున్నా, ఆటపై దృష్టి పెట్టకుండా భారత్పై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుంది. తాజాగా పాక్ ఆల్రౌండర్ ఖుష్దిల్ షా చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీశాయి. ఒక పోడ్కాస్ట్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఏకంగా అంపైర్ల పైనే ఆరోపణలు చేశాడు.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్లలో అనేక అంశాలు భారత్ జట్టుకు అనుకూలంగా ఉంటాయని ఆరోపించాడు. అంపైరింగ్ నిర్ణయాల నుంచి మ్యాచ్ నిర్వహణ వరకు కొన్ని విషయాలు భారత్కు ప్రయోజనం చేకూరేలా ఉంటాయని ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భారత్- పాక్ మ్యాచ్లో ఒత్తిడి, భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. మ్యాచ్ ప్రారంభంలో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని, కానీ ఆట కొనసాగే కొద్దీ ఆ ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నాడు. మా కాలంలో కూడా మేము భారత్ను ఓడించామని, మంచి మ్యాచ్లు ఆడామని చెప్పాడు. పాకిస్తాన్ భారత్ను ఓడిస్తే, ఆ విజయానికి ప్రాముఖ్యత పెరుగుతుందని ఖుష్దిల్ షా అన్నాడు. పాక్, భారత్ను ఓడిస్తే ఆ విజయం ఇచ్చే ఆనందం వేరే స్థాయిలో ఉంటుందని చెప్పుకొచ్చాడు.
Also Read
- Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లోనే దాయాదులు తలపడుతున్నారు. ఐసీసీ టోర్నీల్లో ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఎప్పుడూ భారత్ను ఓడించలేకపోయింది. ప్రతీ సందర్భంలో భారత్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. పాకిస్థాన్ చివరిసారిగా 2022 సెప్టెంబర్లో జరిగిన ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్లో భారత్ను ఓడించింది. అప్పటి నుండి, ఈ రెండు జట్ల మధ్య జరిగిన వరుసగా ఆరు మ్యాచ్లలో భారత్ విజయం సాధించింది. వన్డే క్రికెట్లో భారత్పై పాకిస్థాన్ చివరి విజయం కూడా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనే నమోదైంది. అప్పటి నుండి, భారత్ ప్రతిసారీ పాకిస్థాన్ను ఓడించి, ప్రధాన టోర్నమెంట్లలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
Khushdil Shah on playing against India. 🗣
"Matches against India carry a few extra emotions & then the pressure eases a bit. When we were playing, we used to beat them as well. Things tend to go in their favor during matches. Umpiring decisions go in their favor, as do some… pic.twitter.com/suNHPDz1eC
— Sheri. (@CallMeSheri1_) June 7, 2026
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!