Supreme Court : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI171 ప్రమాదానికి సంబంధించి ఇద్దరు వైద్యులు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తక్షణమే సుమోటోగా విచారణ చేపట్టి, బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు (అహ్మదాబాద్లోని బిజె మెడికల్ కాలేజీ రెసిడెంట్ వైద్యులతో సహా) ఒక్కొక్కరికి రూ.50 లక్షల మధ్యంతర పరిహారాన్ని వెంటనే ప్రకటించాలని, వెంటనే పంపిణీ చేయాలని పేర్కొన్నారు.
READ MORE: Nara Lokesh: ఇక పై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అమలు..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు, విమానయాన నిపుణులు, ఆర్థికవేత్తలు, బీమా సంస్థల నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పిటిషన్లో అభ్యర్థించారు. త్రివేణి కోడ్కనీ వర్సెస్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సూత్రాల ప్రకారం.. బాధిత కుటుంబాలకు తుది పరిహారాన్ని ఈ కమిటీ నిర్ణయించాలని స్పష్టం చేశారు. దీనితో పాటు, బాధిత కుటుంబాలు సుదీర్ఘ న్యాయ ప్రక్రియ ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేకుండా.. పరిహారం క్లెయిమ్లను త్వరగా పరిష్కరించడానికి ఎయిర్ ఇండియా లిమిటెడ్ను ఆదేశించాలని పిటిషన్ కోరారు.
READ MORE: Donald Trump: ‘‘ పరిస్థితి మరింత దిగజారుతుంది’’.. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..
మృతులకు అర్హులైన బంధువులకు పునరావాస సహాయం, ఉపాధి అవకాశాలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని పిటిషన్లో కోరారు. అలాగే.. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!