Ahmedabad plane crash: DNA ద్వారా 163 మృతదేహాల గుర్తింపు.. 124 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ahmedabad plane crash: అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుండగా, DNA పరీక్షల ద్వారా ఇప్పటివరకు 163 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 124 మృతదేహాలను బాధితుల కుటుంబాలకు అప్పగించారు.
ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో మృతదేహాలు తీవ్రంగా కాలిపోయాయి. దీనితో వాటిని గుర్తించడానికి పెద్ద సమస్యగా మారింది. దాంతో అధికారులు DNA పరీక్షలతోనే గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. అహ్మదాబాద్ సివిల్ హాస్పటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 163 DNA నమూనాలు సరితేలాయి. అందులో 124 మృతదేహాలను కుటుంబాలకు అప్పగించాం. మిగతావి త్వరలో అప్పగిస్తామని అన్నారు.
Also Read
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
- Vaibhav Sooryavanshi: ఒకే ఒక్కడు.. బోలెడు రికార్డులు.. క్యూ కట్టిన అవార్డ్స్ ఇవే.!
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
Read Also: Gang Rape: బీచ్లో ప్రియుడి ముందే యువతిపై సామూహిక అత్యాచారం..10 మంది అరెస్ట్
ప్రమాదంలో గాయపడ్డ 71 మందిలో 9 మంది ఇంకా చికిత్స పొందుతుండగా, చికిత్స పొందుతూ ఇద్దరు మరణించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో BJ మెడికల్ కాలేజ్కు చెందిన నాలుగు మంది MBBS విద్యార్థులు మరణించారని స్పష్టంగా తెలిపారు. జూన్ 12న మధ్యాహ్నం 1.39 గంటలకు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీంలైనర్ విమానం, కొన్ని నిమిషాల్లోనే ఒక మెడికల్ కాలేజ్ భవనంపై పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మందిలో 241 మంది మరణించగా, భూమిపై ఉన్న మరో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Also: Uppena : ఉప్పెన మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో
ఘటన జరిగిన స్థలంలో ఇప్పటికే అధికారులు కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) ను ప్రమాద స్థలంలో నుంచి వెలికితీశారు. ఇది ప్రమాదానికి కారణమైన అంశాలను తెలుసుకునేందుకు కీలకమైన ఆధారంగా భావిస్తున్నారు. DNA పరీక్షల ప్రక్రియ బుధవారం ఉదయం వరకు పూర్తయ్యే అవకాశం ఉందని డాక్టర్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి అన్ని చర్యలు వేగవంతంగా చేపడుతున్నామని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
తాజావార్తలు
-
UPI Payment New Rules: UPI చెల్లింపు న్యూ రూల్స్.. ఈ రోజు నుండి డబ్బు పంపే విధానంలో మార్పులు
-
Virat Kohli: ప్రతి నిరాశను పాఠంగా మార్చుకున్నాడు.. నాలుగు సార్లు కింద పడ్డా పైకి లేచాడు.. కోహ్లీ గూస్ బంప్స్ రికార్డు!
-
JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
-
Virat Kohli : ఏకంగా 17 సార్లు…! రెండు సార్లు RCB కప్ కొట్టడానికి కారణం కోహ్లీనే.. ఈ లెక్కలే సాక్ష్యం భయ్యా!
-
Today Astrology: సోమవారం దిన ఫలాలు.. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్త సుమీ!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!