NTV Telugu Site icon

DK Aruna : కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలున్నాయి.. ఎన్నికల కోసం జిమ్మిక్కులు చేస్తున్నారు

Dk Aruna

Dk Aruna

ముఖ్యమంత్రి కావాలన్న ఆత్రుతతో కేసీఆర్ ను నిర్లక్ష్యం చేయవద్దని కేటీఆర్ ను కోరుతున్నానని అన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవాలని, కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలున్నాయన్నారు. బావ బావమరుదులు ఆదరాబాదరాగా పనులు పూర్తికాకుండానే తెళ్లసున్నాలు వేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, ఎన్నికల కోసం జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు డీకే అరుణ. గృహలక్ష్మి పథకం ఇన్నాళ్లు గుర్తురాలేదా ? అని డీకే అరుణ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయవద్దని, కేసీఆర్ ఆరోగ్యం పై ఆందోళన లేకుండా… సిఎం కావాలనే ఆరాటం లోనే కేటీఆర్ ఉన్నారన్నారు.

Also Read : Plane crash : ప్రమాదానికి గురైన విమానం.. నలుగురు మృతి

దొంగ నోటిఫికేషన్లు వేసి .. పేపర్లు లీక్ చేసి నిరుద్యోగులను మోసం చేశారని, ఒక్కసారి బీజేపీకి అధికారం ఇచ్చి చూడండని డీకే అరుణ అన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, ఎంఐఎం లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, పెద్దాయనను ఫార్మ్ హౌస్ లో పడుకోబెట్టి నువ్వా నేనా అన్నట్టుగా కేటీఆర్, హరీష్ పరిగెత్తుతున్నారని డీకే అరుణ విమర్శలు చేశారు. అయితే.. డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు సమక్షంలో ఆ పార్టీలో క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్ చేరారు. హైదరాబాద్ లోని బర్కత్‌పుర బీజేపీ నగర కార్యాలయంలో చీకోటి ప్రవీణ్ కాషాయ కండువా కప్పుకున్నారు.

Also Read : Prabhas: ఇంకా టైమ్ ఉంది కానీ అప్పుడే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు