Go First Flight: 50 మందిని వదిలేసి విమానం టేకాఫ్.. ప్రయాణికులు తీవ్ర అసహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Go First Flight: 50మందికి పైగా ప్రయాణికులను వదిలేసి ‘గో ఫస్ట్’ విమానం సరిగ్గా చెక్ చేసుకోకుండానే గాల్లోకి ఎరిగిపోయింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు. దీంతో సందరు సంస్థ ‘గో ఫస్ట్’.. అంతరాయానికి చింతిస్తున్నాం అంటూ సమాధానం చెప్పింది. బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన గో ఫస్ట్ ఎయిర్వేస్ విమానం ప్రయాణీకులు లిస్టు ప్రకారం అంతా వచ్చారా? విమానం ఎక్కారా లేదా? అనేది చూసుకోకుండానే గాల్లోకి ఎగిరిపోయింది. సదరు ప్రయాణీకులు లేట్ వల్ల విమానం ఎక్కలేకపోవటం కాదు. సదరు సంస్థ నిర్లక్ష్యం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా..50 మందికి పైగా ప్రయాణికులను వదిలేసి టేకాఫ్ తీసుకుంది.
దీంతో విమానాశ్రయంలోనే మిగిలిపోయిన మిగతా ప్రయాణికులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. విమానయాన సంస్థ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఈ క్రమంలోనే కొంత మంది ట్వీట్లకు స్పందించిన గో ఫస్ట్ సంస్థ.. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు సమాధానం ఇచ్చింది. సంబంధిత ప్రయాణికులను తమ వివరాలు పంచుకోవాల్సిందిగా కోరింది. గో ఫస్ట్ చేసిన ఘనకార్యంపై శ్రేయా సిన్హా అనే ప్రయాణికురాలు ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ..‘ఉదయం 6.20కు విమానం ఉండగా.. 54 మందికిపైగా ప్రయాణికులు ఉదయం 5.35 గంటలకే బస్సు ఎక్కారు. కానీ గంటకుపైనే బస్సులోనే ఉంచేశారు. ఇది సంస్థ నిర్లక్ష్యమేనంటూ మండిపడ్డారు.
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
Tamilnadu: గవర్నర్ ప్రసంగంపై సీఎం అభ్యంతరం.. అసెంబ్లీ నుంచి వాకౌట్
అలాగే సతీశ్ కుమార్ అనే వ్యక్తి టికెట్ ఫొటోలు షేర్ చేస్తూ.. ఒక బస్సులోని ప్రయాణికులు మాత్రమే విమానంలో ఎక్కారని, మరో బస్సులోని వారంతా బస్సులోని ఎయిర్పోర్టులోనే ఉండిపోయారని వెల్లడించారు. ఇదే విషయాన్ని ప్రశ్నించగా ఫ్లైట్ తిరిగి వస్తుందని చెప్పారని కానీ ఎంతకు రాలేదని వాపోయారు. విమానయాన సంస్థతోపాటు జ్యోతిరాదిత్య సింధియా, ప్రధాని కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ.. ఫిర్యాదులు చేశారు. అయితే, ఉదయం 10 గంటలకు మరో విమానంలో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!