Go First Flight: 50 మందిని వదిలేసి విమానం టేకాఫ్.. ప్రయాణికులు తీవ్ర అసహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Go First Flight: 50మందికి పైగా ప్రయాణికులను వదిలేసి ‘గో ఫస్ట్’ విమానం సరిగ్గా చెక్ చేసుకోకుండానే గాల్లోకి ఎరిగిపోయింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు. దీంతో సందరు సంస్థ ‘గో ఫస్ట్’.. అంతరాయానికి చింతిస్తున్నాం అంటూ సమాధానం చెప్పింది. బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన గో ఫస్ట్ ఎయిర్వేస్ విమానం ప్రయాణీకులు లిస్టు ప్రకారం అంతా వచ్చారా? విమానం ఎక్కారా లేదా? అనేది చూసుకోకుండానే గాల్లోకి ఎగిరిపోయింది. సదరు ప్రయాణీకులు లేట్ వల్ల విమానం ఎక్కలేకపోవటం కాదు. సదరు సంస్థ నిర్లక్ష్యం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా..50 మందికి పైగా ప్రయాణికులను వదిలేసి టేకాఫ్ తీసుకుంది.
దీంతో విమానాశ్రయంలోనే మిగిలిపోయిన మిగతా ప్రయాణికులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. విమానయాన సంస్థ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఈ క్రమంలోనే కొంత మంది ట్వీట్లకు స్పందించిన గో ఫస్ట్ సంస్థ.. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు సమాధానం ఇచ్చింది. సంబంధిత ప్రయాణికులను తమ వివరాలు పంచుకోవాల్సిందిగా కోరింది. గో ఫస్ట్ చేసిన ఘనకార్యంపై శ్రేయా సిన్హా అనే ప్రయాణికురాలు ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ..‘ఉదయం 6.20కు విమానం ఉండగా.. 54 మందికిపైగా ప్రయాణికులు ఉదయం 5.35 గంటలకే బస్సు ఎక్కారు. కానీ గంటకుపైనే బస్సులోనే ఉంచేశారు. ఇది సంస్థ నిర్లక్ష్యమేనంటూ మండిపడ్డారు.
Also Read
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
Tamilnadu: గవర్నర్ ప్రసంగంపై సీఎం అభ్యంతరం.. అసెంబ్లీ నుంచి వాకౌట్
అలాగే సతీశ్ కుమార్ అనే వ్యక్తి టికెట్ ఫొటోలు షేర్ చేస్తూ.. ఒక బస్సులోని ప్రయాణికులు మాత్రమే విమానంలో ఎక్కారని, మరో బస్సులోని వారంతా బస్సులోని ఎయిర్పోర్టులోనే ఉండిపోయారని వెల్లడించారు. ఇదే విషయాన్ని ప్రశ్నించగా ఫ్లైట్ తిరిగి వస్తుందని చెప్పారని కానీ ఎంతకు రాలేదని వాపోయారు. విమానయాన సంస్థతోపాటు జ్యోతిరాదిత్య సింధియా, ప్రధాని కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ.. ఫిర్యాదులు చేశారు. అయితే, ఉదయం 10 గంటలకు మరో విమానంలో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Mohsin Naqvi: ఐపీఎల్ ఫైనల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీని బీసీసీఐ ఆహ్వానించిందా? క్లారిటీ ఇదిగో..
-
Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
-
David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ నుంచి క్రేజీ లీక్ వైరల్!
-
Sunil Narine: ఇంకా చాలా మ్యాచ్లు ఆడాలని ఉంది.. ఒక్కసారిగా ఏడ్చేసిన కేకేఆర్ స్టార్ సునీల్ నరైన్!
-
Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..