Direct Tax Collection: బడ్జెట్ అంచనాలో రూ.10.64 లక్షల కోట్లు వసూలైన ప్రత్యక్ష పన్నులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Direct Tax Collection: 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23.4 శాతం పెరిగాయి. 2023 ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మొత్తం ప్రత్యక్ష పన్నులు రూ.10.64 లక్షల కోట్లు వసూలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు బడ్జెట్ అంచనాలో 58.34 శాతానికి లేదా రూ.10.64 లక్షల కోట్లకు చేరాయని, గతేడాది అదే కాలంతో పోలిస్తే ఇది 23.4 శాతం ఎక్కువని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యక్ష పన్నుల వసూళ్ల డేటాను విడుదల చేసింది. రీఫండ్లను జారీ చేయడానికి ముందు ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య కాలంలో స్థూల వసూళ్లు 17.7 శాతం పెరిగి రూ.12.67 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మొత్తం రూ.2.03 లక్షల కోట్ల రీఫండ్ జారీ చేయబడింది. తొలిదశలో రీఫండ్లు ఫెయిల్ అయిన వారికి.. ప్రస్తుతం ప్రత్యేక చొరవ తీసుకున్నామని, చెల్లుబాటు అయ్యే బ్యాంకు ఖాతాలకు రీఫండ్లు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also:Cameron Green: అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. 12 ఏళ్లకు మించి బతకలేనన్నారు: కామెరూన్ గ్రీన్
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను కలిపి రూ.18.23 లక్షల కోట్ల పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పరోక్ష పన్ను (జీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ) వసూళ్లు రూ.15.38 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో, కార్పొరేట్ ఆదాయపు పన్ను 7.13 శాతం పెరిగింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను 28.29 శాతం పెరిగింది. దీనికి సెక్యూరిటీ లావాదేవీల పన్ను కలిపితే, మొత్తం వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 27.98 శాతం పెరిగాయి. ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య 10 కోట్లు దాటిందని ప్రభుత్వం ఇటీవలే వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10.09 పాన్ కార్డ్ హోల్డర్లు ఆదాయపు పన్ను చెల్లించారు. అయితే, డిసెంబర్ 2వరకు, 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి మొత్తం 7.76 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేశారు. 33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అంతకుముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 20 శాతం, పరోక్ష పన్నుల వసూళ్లు 5 శాతం చొప్పున పెరుగుతున్నాయన్నారు.
Read Also:KCR: ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. అక్కడి నుంచి ఎక్కడికి వెళతారంటే..
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!