Dil Raju : సమంత ప్రధాన పాత్ర పోషించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది సినిమా. తొలత భారీ అంచనాలతో రిలీజై అంచనాలను తలకిందులు చేస్తూ నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఫెయిల్యూర్ పై నటి సమంత తనదైన శైలిలో స్పందించారు. సినిమాలో నటించడం వరకే తన పని.. అని ఫలితం తన చేతిలో లేదంటూ.. భగవద్గీత శ్లోకాన్ని కోట్ చేసింది.
Read Also:Lufthansa: భారత్లో మరో రెండు కొత్త మార్గాల్లో లుఫ్తాన్సా సర్వీస్
సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు.. సినిమా రిజల్ట్ పై స్పందించారు. తన 25ఏళ్ల కెరీర్ లోనే శాకుంతలం సినిమాను అతిపెద్ద లాస్ గా అభివర్ణించాడు. దిల్ రాజుకు ఏదైనా ఉన్నదున్నట్లు చెప్పేస్తారు. సమంతలా నర్మగర్భంగా మాట్లాడ్డం దిల్ రాజుకు చేతకాదు. ఈ విషయం పై దిల్ రాజు మాట్లాడుతూ “సగటు ఆడియన్స్ ను అన్ని థియేటర్లకు పంపించి రివ్యూస్ తెప్పించేశాం. అప్పటికే మాకు విషయం అర్థమైపోయింది. ఇక సోమవారం, మంగళవారానికి కలెక్షన్లు లేవంటే రిజల్ట్ ఏంటనేది గ్రహించాలి. అప్పటికీ ఇంకా భ్రమల్లో ఉండకూడదు. నా 25 ఏళ్ల కెరీర్ లోనే అతిపెద్ద జర్క్ ఇచ్చింది శాకుంతలం.”
Read Also:Rahul Gandhi: రాహుల్గాంధీకి బాంబు బెదిరింపులు.. 60 ఏళ్ల నిందితుడు అరెస్ట్
ఇలా శాకుంతలం సినిమాపై ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేశాడు దిల్ రాజు. గుణశేఖర్ తో కలిసి ఈ సినిమాను నిర్మించారు దిల్ రాజు. దర్శకుడు గుణశేఖర్, సమంతపై ఉన్న నమ్మకంతో భారీగా పెట్టుబడి పెట్టాడు. తాజా సమాచారం ప్రకారం, పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వచ్చినట్టు లేదు. ఇద్దరు నిర్మాతల్లో ఎవరికి ఎంత నష్టం వచ్చిందనేది వాళ్లకే తెలియాలి.