PM Modi: కనీసం ‘మహదేవ్’ని కూడా వదలడం లేదు.. కాంగ్రెస్పై ప్రధాని మోడీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేత, సీఎం భూపేష్ బఘేల్ ‘మహదేవ్ బెట్టింగ్ యాప్’లో ఇరుకున్నారు. యాప్ ప్రమోటర్ల నుంచి బఘేల్కి రూ. 508 కోట్లు అందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ వివాదం రాజకీయం ప్రాముఖ్యతను పెంచింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ని ఉటంకిస్తూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్రమ డబ్బును తరలిస్తున్న కొరియర్ని ఈడీ పట్టుకోవడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని ఏజెన్సీ పేర్కొంది.
రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి నిధులు సమకూర్చేందుకు కాంగ్రెస్ పార్టీ అక్రమ డబ్బును ఉపయోగిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. పరమశివుడి నామమైన ‘మహాదేవ్’ని కూడా కాంగ్రెస్ పార్టీ వదలడం లేదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ, ఛత్తీస్గడ్ ప్రభుత్వం ప్రజల్ని దోచుకోవడానికి ఎలాంటి అవకాశాన్ని కూడా వదిలిపెట్టదు, వారు మహదేశ్ పేరును కూడా వదిలిపెట్టలేదు’’ అని దుర్గ్ లో జరిగిన ర్యాలీలో ప్రధాని అన్నారు.
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
Read Also: Heart Attack: 9వ తరగతి బాలికకు గుండెపోటు.. పరీక్షా హాలులోనే మృతి
గురువారం ఈడీ ఛత్తీస్గడ్ లో జరిపిన దాడుల్లో రూ. 5 కోట్లతో కొరియర్ పట్టుబడ్డాడు. ఈ డబ్బును బఘేల్ అనే రాజకీయ నాయకుడికి ఇవ్వాల్సి ఉందని ఈడీ ముందు సదరు కొరియర్ ఒప్పుకున్నారు. ఈ కేసులో మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎం బఘేల్కి రూ. 508 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నిందితులందరిపై చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ వెల్లడించారు. ప్రతీపైనాను వారి నుంచి తీసుకుంటాం, ఇలాంటి స్కాములపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. నవంబర్ 7, 17 తేదీల్లో రెండు విడుతలుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఓటింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!