Vijayawada: బెజవాడ వాసులకు కొత్త టెన్షన్..
- విజయవాడలో డయేరీయా ప్రమాద ఘంటికలు..
- తెల్లారేసరికి 30 డయేరియా కేసులు..
- ఒకే ఏరియాలో రావడంతో ప్రజల్లో భయాందోళనల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: బెజవాడ వాసులకు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది.. వాంతులు విరేచనాలతో ఒకేసారి 18 మంది, కొత్త రాజరాజేశ్వరి పేట నుంచీ వచ్చి కొత్త ప్రభుత్వాసుపత్రిలో చేరడంతో విషయం బయటకి వచ్చింది.. దీంతో, మొత్తం అధికార యంత్రాంగం అలర్ట్ అయింది.. కొత్త రాజరాజేశ్వరి పేటలోని ఒక మున్సిపల్ స్కూలులో 7 బెడ్లు కలిగిన మూడు వార్డులు సిద్ధం చేసారు.. స్థానికంగా వచ్చిన డయేరియా కేసులకు వెంటనే ప్రాథమికంగా చికిత్స అందిస్తున్నారు.. వరుసగా కేసులు పెరుగుతుండటంతో కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో 34 బెడ్లతో ఒక వార్డును సిద్ధం చేసారు.. అలాగే 24 బెడ్లతో మరొక వార్డును సిద్ధం చేసారు.. దాదాపు 70కి పైగా కేసులు నమోదు కావడంతో మొత్తం మునిసిపల్, వైద్య ఆరోగ్య శాఖల క్షేత్రస్ధాయి ఉద్యోగులంతా కొత్త రాజరాజేశ్వరి పేటలోనే ఉన్నారు.. ఇంటింటికి సర్వేలు చేయడం మొదలుపెట్టారు.. నీటి శాంపిల్స్ తీసుకుని టెస్టులకు పంపిస్తున్నారు.. మునిసిపల్ శాఖామంత్రి నారాయణ, స్ధానిక ఎమ్మెల్యే బొండా ఉమాతో కలిసి హెల్త్ క్యాంపును పరిశీలించారు… అధికారులతో అక్కడి పరిస్ధితులను అడిగి తెలుసుకున్నారు.. ఆ ప్రాంతంలో గణేష్ నిమజ్జనం తరువాత పెట్టిన భోజనాలు తిన్నవారు అనారోగ్యానికి గురయ్యారని అనుమానాలు వ్యక్తం చేసారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: ఇదే మనకు మంచి అవకాశం.. ఏ మాత్రం జాప్యం తగదు..
Also Read
డయేరియా రావడానికి సాధారణంగా కలుషిత నీరు కారణం అవుతుంది… అయితే ప్రాథమిక టెస్టులలో ఆ ప్రాంతంలోని నీరు కలుషితం కాదని, త్రాగవచ్చని తేలిందని స్థానిక ఎంఎల్ఏ సైతం అన్నారు… ఇంకా డీటైల్డ్ రిపోర్టు కోసం ల్యాబ్ కు శాంపిల్స్ పంపించామని అధికారులు, ఎంఎల్ఏ అన్నారు.. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన బాధితులను సైతం ఎంఎల్ఏ, మంత్రి పరామర్శించారు.. నీటిని పరీక్షలు నిర్వహించడానికి ఒక ప్రత్యేక వాహనాన్ని తీసుకొచ్చారు ఫుడ్ కంట్రోల్ అధికారులు.. పూర్తిస్థాయిలో టెస్టులు నిర్వహిస్తారు.. బ్యాసిలస్ టెస్టుల కోసం గుంటూరు ల్యాబ్ కు పంపిస్తారు… గంట గంటకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో, అధికారులు 24 గంటలు వైద్య సేవలు అందించేలా ఏర్పాటు చేసారు… డయేరియా కేసులు ఇంకా పెరిగి మరో పాండమిక్ గా మారకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా చూడాలి మరి.. మరోవైపు, సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు ప్రజలు.. ఏ ఆస్పత్రి చూసినా.. రోగులతో కిటకిటలాడుతున్నాయి..
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!