బాక్సాఫీస్ వద్ద ధురంధర్ సృష్టిస్తున్న ప్రభంజనం రోజుకో కొత్త రికార్డుతో దూసుకుపోతోంది. విడుదలై మూడో వారం పూర్తవుతున్నప్పటికీ, ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజూ కొత్త బెంచ్మార్క్లను సెట్ చేస్తూ, ధురంధర్ ప్రేక్షకుల్ని థియేటర్లకు భారీగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా మూడో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ, తాజాగా విడుదలైన హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ అవతార్ ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్లను కూడా ధురంధర్ దాటేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇది సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి నిదర్శనం.
Also Read : Actress Mobbed : వీళ్లు మారరు.. నిన్న నిథి.. నేడు సమంతపై ఫ్యాన్స్ అసభ్యప్రవర్తన
ఇదిలా ఉంటే, మూడో శనివారం రోజున ధురంధర్ మరో ఆల్టైమ్ రికార్డ్ సృష్టించింది. థర్డ్ సాటర్డే కలెక్షన్ల విషయంలో ఇప్పటివరకు ఏ సినిమా సాధించని స్థాయిలో వసూళ్లు నమోదు చేసి, ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. ఇండియన్ బాక్సాఫీస్లో ఎప్పటికీ చెరగని రికార్డుగా నిలిచిన బాహుబలి 2 రికార్డును ఇప్పుడు ధురంధర్ బద్దలు కొట్టింది. గత 8.5 సంవత్సరాలుగ 16వ రోజు ఇండియా వైడ్గా అత్యధికంగా గ్రాస్ కలెక్ట్ చేసిన రూ. 36 కోట్లు రికార్డును బాహుబలి 2 పేరిట ఉంది. ఇప్పటివరకు ఏ సినిమా అధిగమించలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ రికార్డ్ ను ధురంధర్ అధిగమించింది. ధురంధర్ 16వ రోజు ఏకంగా రూ. 39 కోట్ల గ్రాస్ వసూళ్లతో, బాహుబలి 2 పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసి ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, ఈ ఊపు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని బాక్సాఫీస్ రికార్డులు ధురంధర్ ఖాతాలో చేరడం ఖాయం అంటోంది ట్రేడ్. అవతార్ 3 రిలీజ్ అయినప్పటికీ ధురంధర్ ఎక్కడ తగ్గకుండా ఇంకా దూసుకెళ్తోంది.