Dhordo Village: ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ‘ధోర్డో’.. ఫొటోలను షేర్ చేసిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhordo Village: నవరాత్రి పండుగ సందర్భంగా బాలికలు కచ్లోని హస్తకళలతో తయారు చేసిన చనియా-చోళీని ధరించి గర్బాను జరుపుకుంటున్నారు. అదే కళ, సంస్కృతి కారణంగా, కచ్లోని ధోర్డో గ్రామం ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ఐక్యరాజ్యసమితి నుంచి బిరుదును పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ గ్రామానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. కళ, సంస్కృతి పట్ల ఆ గ్రామ ప్రజల అంకితభావాన్ని కూడా ప్రశంసించారు.
కచ్, భుజ్ జిల్లాలకు చెందిన ధోర్డో గ్రామం గుజరాత్లోని సామాజిక, సాంస్కృతిక, సహజ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ద్వారా ప్రపంచంలోని 54 ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఎంపిక చేయబడింది. కచ్ రణోత్సవ్ ద్వారా, ధోర్డో నాగరికత, సంస్కృతి, జానపద జీవితం, వారి ఆర్థిక సంపాదన జీవనశైలి ప్రపంచం ముందుకు వచ్చాయి.
Also Read
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
Also Read: Team India: న్యూజిలాండ్తో ఇండియా మ్యాచ్.. ధర్మశాలకు చేరుకున్న టీమిండియా
ప్రధాని నరేంద్ర మోడీ 2006లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కచ్ రణోత్సవ్ను ప్రారంభించారు. వైట్ రాన్ ఆఫ్ కచ్లోని ధోర్డో కళ, సంస్కృతి, ప్రకృతి సౌందర్యం, పర్యాటక ప్రదేశాన్ని దేశం, ప్రపంచం ముందు తీసుకురావాలనేది మోడీ విజన్. కచ్లోని ధోర్డోను గొప్ప సాంస్కృతిక వారసత్వంగా అభివర్ణిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ఇంటర్నెట్ మీడియా ఖాతాలో ఇక్కడ సహజ, సాంస్కృతిక పండుగలు జరుపుకుంటారని రాశారు. ఇది భారతదేశ పర్యాటక సామర్థ్యాలతో పాటు కచ్ ప్రజల అంకితభావం, శక్తిని చూపుతుంది. ధోర్డో ప్రకాశిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: Kerala: ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసులో నిషేధిత పీఎఫ్ఐ వ్యక్తి అరెస్ట్..
2006, 2015 మధ్య గ్రామానికి సంబంధించిన తన ఫోటోలను కూడా మోడీ పంచుకున్నారు. అక్టోబర్ 16 నుండి 20 వరకు ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగిన యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీకి ఉత్తమ పర్యాటక గ్రామం కోసం 260 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 54 గ్రామాలను ఇందుకు ఎంపిక చేశారు. భారతదేశంలో ఈ బిరుదు పొందిన ఏకైక గ్రామం ధోర్డో.
యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 2021 సంవత్సరం నుంచి పర్యాటక గ్రామాల ఎంపికను ప్రారంభించింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ టూరిజం మంత్రి ములుభాయ్ వెరా ధోర్డోను ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ దూరదృష్టి, కృషికి పూర్తి క్రెడిట్ ఇచ్చారు. కచ్కు చెందిన ధోర్దో ప్రపంచ పటంలో గొప్ప స్థానం పొందిందని ముఖ్యమంత్రి అన్నారు. సహజ, సాంస్కృతిక వనరులను ప్రోత్సహించడం, పరిరక్షించడం, గ్రామ స్థిరమైన ఆర్థిక నమూనా, సామాజిక, పర్యావరణ స్థిరత్వం, సాంస్కృతిక వైవిధ్యం, స్థానిక విలువలు, సాంప్రదాయ ఆహారం కోసం ఇటువంటి గ్రామాలను ఎంపిక చేస్తారు.
Here are some more pictures from #AmazingDhordo. Do have a look. pic.twitter.com/9998XY1uBy
— Narendra Modi (@narendramodi) October 20, 2023
తాజావార్తలు
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!