Dharmana PrasadaRao:మా ప్రాంతానికి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Dharama Prasada Rao: మూడురాజధానులకు మద్దతుగా ఏపీ మంత్రులు గళం విప్పుతున్నారు. శ్రీకాకుళంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు. శ్రీకాకుళం బార్ అసోసియేషన్ సభ్యులతో మంత్రి ధర్మాన సమావేశం నిర్వహించారు. 3 రాజధానులకు న్యాయవాదుల మద్దతు కోరిన ధర్మాన… రాజ్యాంగంలో ఎక్కడా క్యాపిటల్ గురించిన ప్రస్తావన లేదన్నారు. రాజ్యాంగంలో రాజధానికి నిర్వచనం లేదు.పాలనా సౌలభ్యం ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు అని రాజ్యాంగం చెబుతోంది.అందరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని ఉండాలి. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ను నాటి టీడీపీ ప్రభుత్వం ప్రక్కన పెట్టేసిందన్నారు.
టిడిపి ప్రభుత్వం తనకు అనుకూలమైన వ్యక్తులతో రాజధానిపై కమిటీ వేసుకుంది.అప్పటి సీఎం చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు.అభివృద్ధి అంతా హైదరాబాద్ లో కేంద్రీకృతమవ్వటం వల్ల సమస్య వచ్చిందని శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ లో చెప్పింది.లార్జ్ క్యాపిటల్ పనికిరాదని శివరామకృష్ణన్ చెప్పారు.పెట్టుబడి అంతా అమరావతిలో పెడితే ఎలా.ఆ ప్రాంతం అభివృద్ధి చెందిన తర్వాత మనల్ని వెల్లగొడితే ఏమి కావాలి.అమరావతిలో రియల్ ఎస్టేట్ రాజధాని మోడల్ పెట్టారు.చంద్రబాబు స్వార్ధపూరిత ఆలోచనే అమరావతి.సింగపూర్ ప్రైవేట్ కంపిణీలతో లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారు.
Also Read
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
Read Also: Deepika Padukone: ఆ.. ఆలోచనే లేదు.. మేము బానే ఉన్నాం
సింగపూర్ ప్రభుత్వానికి అమరావతి రాజధానికి సంబంధం లేదని సింగపూర్ మంత్రి ఈస్వరన్ చెప్పారు.రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన శివరామకృష్ణన్ కమిటీ సూచనలు అమలు చేయటమే మా ముందున్న మార్గం.మూడు రాజధానుల ఏర్పాటు లో జగన్ స్వార్ధం ఏముంది.కడపలో రాజధాని పెడుతున్నాడా?భూమి విలువ రెట్టింపు అవుతుందని భూమి ఇస్తే అది త్యాగం అవుతుందా?చంద్రబాబు మాటలకు రైతులు మోసపోయారు.మా ప్రాంతానికి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటారా? అని మంత్రి ధర్మాన అమరావతి రైతుల మహా పాదయాత్ర నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Assam CM: అస్సాం ముఖ్యమంత్రికి ‘జెడ్ ప్లస్’ సెక్యూరిటీ.. అందుకేనా?
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!