Bangladesh: బంగ్లాదేశ్లో విధ్వంసం..భారతీయులకు ఎంబసీ కీలక సూచన
- రిజర్వేషన్ కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున నిరసనలు
- నిరసనలో ఆరుగురి మృతి
- వంద మందికి పైగా గాయాలు
- అక్కడున్న భారతీయులకు కీలక సూచన చేసిన భారత ఎంబసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని మార్చాలంటూ గత కొన్ని రోజులుగా యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలు కాస్త రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో ఒక నిర్దిష్ట విభాగానికి ఇచ్చిన కోటా (రిజర్వేషన్)కి వ్యతిరేకంగా విద్యార్థులు బలమైన ప్రదర్శనలు, విధ్వంసం సృష్టిస్తున్నారు.
READ MORE: Jagapathi Babu: సిగ్గు శరం లేని వాడినని దిగులు పడను.. జగ్గు భాయ్ పోస్ట్ వైరల్..
Also Read
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో మొత్తం 56 శాతం రిజర్వేషన్ విధానం ఉంది. ఇందులో 1971 యుద్ధంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలు మరియు కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్ ఉంది. 10% పరిపాలనా జిల్లాలు, 10% మహిళలు మరియు 5% జాతి మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో శారీరక వికలాంగులకు 1 శాతం రిజర్వేషన్ కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని నిరసన కారులు కోరుతున్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరసనలో 6 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడినట్లు సమాచారం. ముందు జాగ్రత్తగా కళాశాలలను, పాఠశాలలను, మదర్సాలను మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ తెరవొద్దని సూచించారు. మరోవైపు, గురువారం దేశవ్యాప్త బంద్కు ఆందోళనకారులు పిలుపునిచ్చారు.
READ MORE:UTTAR PRADESH: రాజకీయ దుమారంగా మారిన “కన్వర్ యాత్ర” రూల్స్.. ‘‘యాంటీ ముస్లిం’’ అంటూ విమర్శలు..
ఈ నేపథ్యంలో భారత ఎంబసీ అక్కడున్న భారతీయులకు కీలక ప్రకటన జారీ చేసింది. బంగ్లాదేశ్లో ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో భారత కమ్యూనిటీకి చెందిన పౌరులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని తెలిపింది. ఎక్కడికైనా వెళ్లాల్సిన పరిస్థితులను వీలైనంత తగ్గించుకోవాలంది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే సాయం కోసం వెంటనే హైకమిషన్, అసిస్టెంట్ కమిషన్స్ను సంప్రదించాలని వెల్లడించింది. 24 గంటల ఎమర్జెన్సీ నంబర్లను కూడా విడుదల చేసింది.
తాజావార్తలు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్తో బాలీవుడ్లో కలకలం
-
Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!